పార్టీలు మారి.. విజేతగా నిలిచి
రాజకీయ నాయకుల లక్ష్యాల్లో ఒకటి ప్రజాప్రతినిధిగా ఎంపికవడం. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగినా.. పదవులు దక్కకుంటే మరో పార్టీలోకి వెళ్లడం సహజం.
తుంగతుర్తి, న్యూస్టుడే: రాజకీయ నాయకుల లక్ష్యాల్లో ఒకటి ప్రజాప్రతినిధిగా ఎంపికవడం. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగినా.. పదవులు దక్కకుంటే మరో పార్టీలోకి వెళ్లడం సహజం. పార్టీ మారడంతో పాటు ఎమ్మెల్యే టికెట్ సాధించి తాజా ఎన్నికల బరిలో నిలిచి ప్రజల మన్ననలతో భారీ మెజార్టీతో విజయం సాధించారు.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మందుల సామేల్
మాతృపార్టీలో చేరి గెలిచిన రాజగోపాల్రెడ్డి
మునుగోడు శాసనసభ స్థానానికి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విజయం సాధించారు. తర్వాత పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరడంతో ఆ నియోజకవర్గానికి మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్న ఆయన ఎకాఎకిన భాజపాలో చేరి ఆ పార్టీ నుంచి మళ్లీ ఎన్నికల బరిలో నిల్చొని ఓటమి చవిచూశారు. ఆ తర్వాత కొన్ని మాసాలకే అసెంబ్లీ ఎన్నికలు రావటంతో రాజగోపాల్రెడ్డి వెంటనే భాజపా నుంచి మాతృపార్టీ కాంగ్రెస్లోకి చేరారు. ఏకంగా ఆ పార్టీ టికెట్ తెచ్చుకొని ఎన్నికల బరిలో నిలిచి మళ్లీ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
ఉద్యమ నేతగా ఎదిగి..
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ్యుడిగా ఉండి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ఒకరు మందుల సామేల్. ఈయన తుంగతుర్తి నియోజకవర్గంలో గ్రామగ్రామం తిరిగి అప్పటి తెరాస(భారాస)ను బలోపేతం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు తుంగతుర్తి నుంచి తెరాస టికెట్ తెచ్చుకోలేక పోయారు. మూడోసారి కూడా భారాస అధిష్ఠానం సిట్టింగ్లకే టికెట్ కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో, తిరుమలగిరిలో జరిగిన భారాస ప్రగతి నివేదన సభలో గాదరి కిశోర్కుమార్ను అసెంబ్లీ ఎన్నికల్లో 40 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను కేటీఆర్ కోరారు. దీంతో తనకు భారాసలో గుర్తింపు లేదని, అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని గ్రహించి సామేల్ వెంటనే కాంగ్రెస్లోకి చేరారు. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల తర్వాత ఆఖరి గడియల్లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్ఠానం సామేల్ను ప్రకటించి టికెట్ ఇచ్చింది. ఆ ఉత్సాహంతోనే నామినేషన్ పత్రాల దాఖలు చేసి, తిరుమలగిరిలో సమర శంఖారావం సభ నిర్వహించారు. భారీగా తరలొచ్చిన నాయకులు, కార్యకర్తలు ఆయనకు అండగా నిలిచారు. నియోజకవర్గ ప్రజలూ తెలంగాణ ఉద్యమ నేతగా ఆదరించడంతో 51 వేల ఓట్ల మెజార్టీతో భారాస అభ్యర్థిపై మందుల సామేల్ ఘనవిజయం సాధించారు. త్వరలో అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్