జిల్లాలో 3.02 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
నల్గొండ జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించే వరకు అధికారులు సరైన ఏర్పాట్లు చేశారు.
నల్గొండ గ్రామీణం, న్యూస్టుడే: నల్గొండ జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించే వరకు అధికారులు సరైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల నుంచి పౌరసరఫరా శాఖ అధికారులను తప్పించి పూర్తిగా ధాన్యం సేకరణ కోసమే నియమించారు. ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లు అధికారులకు సవాల్గా మారుతున్నాయి. వాహనాలు రాకపోవడం, తూకాలు ఆలస్యం కావడం, అదనంగా ధాన్యాన్ని తూకం వేస్తున్నారంటూ కర్షకులు ఆందోళనలు, ధర్నాలకు దిగిన ఘటనలుండేవి. అయితే ఈ సీజన్లో కొనుగోళ్లు సజావుగా నడిచినా ఇంకా కొన్ని చోట్లా ఆలస్యం అవుతున్నాయి. దీంతో కేంద్రాల్లో ఉన్న ధాన్యం మిగ్జాం ప్రభావంతో తడిశాయి. మళ్లీ వాటిని తేమశాతం తగ్గడం కోసం ఆరబెట్టుకోవాల్సి వస్తోంది. వానాకాలంలో 5,05,280 ఎకరాల్లో వరిసాగు చేయగా అక్టోబరు నుంచి వరికోతలు చేపట్టారు. కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం వచ్చినా సేకరణ అక్టోబరు చివరి వారంలో చేపట్టారు. ఇప్పటి వరకు 3,02,158 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రూ.598 కోట్లు రైతులకు చెల్లించారు. జిల్లాలో ప్యాక్స్, ఐకేపీ, డీసీఎంఎస్, రైతు సంఘాల ఆధ్వర్యంలో 237 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి 191 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నా.. అక్కడ ఆలస్యం రైతులను వేధిస్తుంది.
మిగ్జాంతో ఆగిన కొనుగోళ్లు..
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మిగ్జాం తుపాన్ కారణంగా నిలిచిపోయాయి. మూడునాలుగు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో కొనుగోలు చేయకపోవడంతో రైతులు తమ ధాన్యం తడవకుండా చర్యలు తీసుకున్నారు. టార్పాలిన్లు కప్పి ఉంచారు. వర్షాలు తగ్గిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు మొదలు పెడతామని .. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని పౌరసఫరాల సంస్థ డీఎం నాగేశ్వర్ రావు తెలిపారు.
ప్రెవేటుగా అమ్మకం..
ఆలస్యంగా కేంద్రాలు మొదలు కావడం వల్ల ముందు కోతకు వచ్చిన ధాన్యం రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయించారు. మిల్లులు సైతం పచ్చి ధాన్యం క్వింటా రూ.2వేల వరకు కోనుగోలు చేసింది. ప్రభుత్వ సేకరణ జాప్యంతో కొందరు రైతులపై ప్రెవేటుగా అమ్ముకున్నారు. యాసంగి సీజన్ మొదలు ధ్యానం డబ్బులు సమయానికి రాకపోగా, రైతుబంధు సాయం అందకపోవటం తదితర కారణాలతో పెట్టుబడులకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల కారణంగా కొంత జాప్యం జరిగినా.. ప్రస్తుతం అధికారులు అప్రమత్తమై రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేసి.. సకాలంలో డబ్బులు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఇక వానాకాలం సీజన్లో సన్నరకాలకు డిమాండ్ ఉండటంతో బహిరంగ మార్కెట్లోనే ఎక్కువగా విక్రయించారు. ముఖ్యంగా మిర్యాలగూడ, హుజూర్నగర్, నల్గొండ ప్రాంతాల్లో సన్నాలను బయట విక్రయించారు. చాలా చోట్ల వ్యాపారులు గ్రామాలకు వచ్చి కొనుగోలు చేశారు. మరి కొందరు మిల్లుల్లో విక్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.