మరిన్ని నీళ్లు పోశాం.. మంచి ఫలాలివ్వాలి మరి!
మీరు మొక్కలు నాటారు. ఆ మొక్కలకు మాతో నీళ్ల పోయించారు. అవి బాగా ఎదిగి చెట్లయ్యాయి. కొత్త పంట కాలం వచ్చింది కదా. మాకూ బాగా ఫలాలివ్వాలి’
మీరు మొక్కలు నాటారు. ఆ మొక్కలకు మాతో నీళ్ల పోయించారు. అవి బాగా ఎదిగి చెట్లయ్యాయి. కొత్త పంట కాలం వచ్చింది కదా. మాకూ బాగా ఫలాలివ్వాలి’
ఇదీ ఉమ్మడి నల్గొండ జిల్లా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 25 లక్షల మంది జనం తాజా ఆకాంక్ష!
వీరి బలమైన ఆకాంక్ష వెనక కథ ఇదే..
ఐదేళ్లకొకసారి వచ్చే పంటల సీజన్ (అసెంబ్లీ ఎన్నికలు) వచ్చింది ఈ మధ్యనే కదా. కొన్ని కంపెనీ (రాజకీయ పార్టీ)ల యాజమాన్యం (అధినేతలు) జనం (ఓటర్ల) మధ్యకు వచ్చి వారి కంపెనీ (పార్టీ) మొక్కల (అభ్యర్థుల)ను చూపిన విషయం తెలిసిందే. జనం (ఓటర్ల) మధ్య వారి ప్రతినిధుల (పార్టీ నాయకుల) సహకారంతో.. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ మొక్కల (అభ్యర్థుల)ను నాటారు (పరిచయం చేశారు). ఇతర మొక్క (స్వతంత్రు)లతో కలిపి మొత్తం నాటినవి (పరిచయం చేసిన వారి సంఖ్య) 276. తమ మొక్కల (పార్టీ అభ్యర్థుల)కు బాగా నీళ్లు పోసి (ఓట్లు వేసి) పెద్ద చేసి (ఎమ్మెల్యేగా గెలిపించి) అప్పగిస్తే చాలని, ఫలాల (సంక్షేమ పథకాల)ను ఆ ఎదిగిన పండ్ల మొక్కల (ఎమ్మెల్యేల) ద్వారానే అందించే బాధ్యత తమదని కంపెనీల పెద్దలు (అధినేతలు) హామీలిచ్చారు. రెండు కంపెనీ (పార్టీ)ల వారి మాటల్నే జనం (ఓటర్లు) గట్టిగా నమ్మారు. 12 నియోజకవర్గాల్లో 25 లక్షల మంది కలిసి.. ఒక కంపెనీ (పార్టీ) 11 మొక్కల (అభ్యర్థుల) కు బాగా నీళ్లు పోశారు (ఓట్లు వేశారు). మరో కంపెనీ (పార్టీ) ఒక మొక్క (అభ్యర్థి) కి నీళ్లు (ఓట్లు) కాస్త తక్కువే. నవంబరు 30న మధ్యవర్తి (ఎన్నికల సంఘం) పరిశీలించి, ఎదిగిన మొక్కల శక్తి (ఎమ్మెల్యే ఓట్ల) ని డిసెంబరు 3వ తేదీన వెల్లడించింది. ఈ సీజన్ (ఎన్నిక)లో ఉమ్మడి జిల్లాలో బాగా ఎదిగిన పండ్ల మొక్కల (ఎమ్మెల్యేల) కంపెనీ (పార్టీ)కే ఐదేళ్ల పేటెంట్ హక్కు (ప్రభుత్వం) దక్కింది. ఈ పండ్ల మొక్క (ఎమ్మెల్యే)ల పంటకాలం (పదవీకాలం) ఐదేళ్లే. ఇక ఈ కంపెనీ యాజమాన్యం (ప్రభుత్వ పార్టీ), ఈ పండ్ల మొక్కలు (ఎమ్మెల్యేలు) ఎంతటి మధురమైన (సంక్షేమ పథకాల) ఫలాలను ఏ మేరకు ప్రజల చేతికి అందించేనో వేచిచూద్దాం మరి!
‘ మేం పెంచి పెద్ద చేసిన 11 పండ్ల మొక్కల (ఎమ్మెల్యేల) కంపెనీ (కాంగ్రెస్ పార్టీ)కే పేటెంట్ హక్కు (ప్రభుత్వం) వచ్చింది. మంచి ఫలాలివ్వాలి. గత సీజన్ (ఎన్నిక)ల్లో మా నీళ్ల (ఓట్ల) తో ఎదిగిన పండ్ల మొక్క (ఎమ్మెల్యే)లు తెగుళ్ల (నిర్లక్ష్యం)తో ఫలాల (సంక్షేమ పథకాల) ను సరిగా పంచలేదు. తప్పనిసరై ఆ చెట్ల (అభ్యర్థుల) ను మే (ఓటర్ల)మే కొట్టేయాల్సి (ఓడించాల్సి) వచ్చింది మరి.’ అని ఇదే సందర్భంలో ఉమ్మడి నల్గొండ జిల్లా జనం (ఓటర్లు) హెచ్చరిస్తున్నారు కూడా!!
న్యూస్టుడే, మేళ్లచెరువు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.