వివాహిత దారుణ హత్య
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున మహిళ దారుణ హత్యకు గురైంది.
తిప్పర్తి, న్యూస్టుడే: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో బసిరెడ్డిపల్లికి వెళ్లే రహదారిలో మహిళ మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శాలిగౌరారం సీఐ రాఘవరావు, ఎస్సై ధర్మ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు నల్గొండ మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన మంజుల(35)గా పోలీసులు గుర్తించారు. ఈమె నల్గొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని వసతిగృహంలో వంట పనిచేస్తున్నారు. ఆ మహిళ మెడకు నలుపు రంగు చున్నీ బిగించి రాళ్లు, ఇతర ఆయుధాలతో తలపై మోది హత్య చేశారు. మహిళ పసుపు రంగు టాప్, నలుపురంగు ప్యాంట్ ధరించి ఉంది. కాళ్లకు వెండి పట్టీలు, వెండి మెట్టెలు ఉన్నాయి. క్లూస్ టీం, సీసీఎస్ టీం సభ్యులు పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ రాఘవరావు తెలిపారు. హత్యకు సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉన్నట్లు ఎస్సై చెప్పారు.
చెల్లని చెక్కు కేసులో ప్రభుత్వ ఉద్యోగికి జైలు
సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్టుడే: చెల్లని చెక్కు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగికి జైలుశిక్ష విధిస్తూ సూర్యాపేట ప్రధాన ప్రథమశ్రేణి న్యాయమూర్తి కామిశెట్టి సురేశ్ గురువారం తీర్పుచెప్పారు. నడిగూడెం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన చల్లా రాజశేఖర్ ప్రభుత్వ ఉద్యోగి. తన అవసరాల నిమిత్తం పలు సందర్భాలలో సూర్యాపేట పట్టణానికి చెందిన కట్టా దయాకర్ వద్ద రూ.4.45 లక్షలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించే నిమిత్తం అదే మొత్తానికి చెక్కు జారీ చేశాడు. వసూలు నిమిత్తం చెక్కును బ్యాంకులో జమచేయగా నిందితుడు రాజశేఖర్ ఖాతాలో నగదు నిల్వలు లేని కారణంగా చెక్కు చెల్లుబాటు కాలేదు. నోటీసు ఇచ్చినా ఫలితం లేకపోవటంతో బాధితుడు దయాకర్ న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. సాక్షులను విచారించిన న్యాయస్థానం నిందితుడు రాజశేఖర్ ఉద్దేశపూర్వకంగా చెల్లని చెక్కు ఇచ్చినట్లు నిర్ధారించి జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. చెక్కుకు రెట్టింపు మొత్తం రూ.8.9 లక్షలు బాధితుడికి పరిహారంగా చెల్లించాలని నిందితుడిని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.