ఆయుష్మాన్ భవలో.. ప్రైవేటు ఆసుపత్రుల నమోదు
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్భవ కార్యక్రమాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయనున్నారు.
మిర్యాలగూడలో ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న డాక్టర్స్ కాలనీ
మిర్యాలగూడ , న్యూస్టుడే: గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్భవ కార్యక్రమాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయనున్నారు. నిర్ణీత విధానంలో తమ ఆసుపత్రుల వివరాలను ఆయుష్మాన్ భవ విభాగంలో నమోదు చేసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం వర్తింపజేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ కార్యక్రమాన్ని కొంత ఆలస్యంగా అనుమతించింది. దీంతో ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల వారు సైతం ‘ఆరోగ్య సౌకర్యాల నమోదు’ ‘ఆరోగ్య ప్రొఫెషనల్స్ నమోదు’ విధానంలో తమ ఆసుపత్రులు, వైద్యుల వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎనిమిది నెలల క్రితం నుంచే ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను ఆన్లైన్లో ఆయుష్మాన్ భవ కింద నమోదు చేస్తున్నారు.
- నమోదు చేసుకున్న ప్రైవేటు ఆసుపత్రుల వారు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో చేరి వైద్యం పొందే వారి ఆరోగ్య సమాచారం ఆయుష్మాన్ భవ విభాగంలో నమోదు చేయాల్సి ఉంది.
- కేంద్రం అందిస్తున్న రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా, ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.
- అన్ని ప్రైవేటు ఆసుపత్రుల వారు తమకు సంబంధించిన వివరాలు ఆయుష్మాన్ భవ విభాగంలో నమోదు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కోటాచలం కోరారు. ఆసుపత్రికి వచ్చే ఓపీ రోగుల వివరాలు సైతం ఆన్లైన్లో నమోదు చేయాలి.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమాచారం పంపారు. ప్రైవేటు ఆసుపత్రుల వారు నేరుగా వెబ్సైట్లోకి వెళ్లి నమోదు చేసుకోవాలని, లేని యెడల జిల్లా ఉపవైద్యాధికారి కార్యాలయంలో నిర్ణీత వివరాలతో వచ్చి నమోదు చేసుకోవాలని ఆదేశించారు.
- నల్గొండ జిల్లాలో 159 ఆసుపత్రులు, 14 నర్సింగ్హోమ్లు, 49 డెలివరీ కేంద్రాలు, 111 స్కానింగ్ సెంటర్లు, 7 ఈఎన్టీ ఆసుపత్రులు, 24 కంటి వైద్యశాలలు, 18 చిన్నపిల్లల ఆసుపత్రులు, 51 దంత వైద్యశాలలు, 221 డయాగ్నస్టిక్ సెంటర్లు ఇతర ఆసుపత్రులు కలిపి మొత్తం 611 ఉన్నాయి.
- సూర్యాపేట జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్హోమ్లు, కంటి, దంత వైద్యశాలలు సుమారు 223 వరకు ఉన్నాయి. బీ యాదాద్రి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్హోమ్లు, నేత్ర, దంత వైద్యశాలలు, డయాగ్నస్టిక్ సెంటర్లు సుమారు 163 వరకు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు