అప్పుడు.. ఇప్పుడూ.. ప్రతిపక్షమే
గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ నేతలంతా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్నారు. అయితే తాము ఉన్న పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరారు.
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే, ఈనాడు డిజిటల్, సూర్యాపేట: గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ నేతలంతా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్నారు. అయితే తాము ఉన్న పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరారు. నాటి అధికార పక్షం.. ప్రస్తుతం ప్రతిపక్షంగా మారడంతో ఆ నేతలంతా మళ్లీ ప్రతిపక్షంలోనే ఉండిపోయారు. దీంతో వీరు నాడు.. నేడు ప్రతిపక్షంలోనే ఉండిపోయారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం నుంచి..
తొలుత ప్రజారాజ్యం పార్టీ తరఫున మిర్యాలగూడ నుంచి బరిలో నిలిచిన అల్గుబెల్లి అమరేందర్రెడ్డి.. ఆ తర్వాత భారాసలో చేరారు. 2014లో భారాస నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్రావు భారాసలో చేరడాన్ని వ్యతిరేకించిన ఆయన కాంగ్రెస్లో చేరారు. 2018లో టికెట్ దక్కకపోవడంతో 2023 వరకు కాంగ్రెస్లో వేచి చూశారు. ఇప్పుడు కూడా టికెట్ దక్కకపోవడంతో తిరిగి భారాసలో చేరారు. అలా అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండిపోయారు.
పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి..
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ చెరుకు సుధాకర్గౌడ్ నాటి భారాస అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకించి.. తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించారు. కొంత కాలం తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన ఆయన.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో కాంగ్రెస్ను వీడి భారాసలో చేరారు. ఎన్నికలో భారాస ఓటమి చవిచూడడంతో మళ్లీ ప్రతిపక్షంలోనే ఉండిపోయారు.
భాజపా నుంచి భారాస.. వయా కాంగ్రెస్
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఒకరు. ఆ తదనంతర పరిణామాలతో ఆయన కూడా యువ తెలంగాణ పార్టీ స్థాపించారు. అయితే పార్టీని కొన్నేళ్లకు భాజపాలో విలీనం చేసిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. అక్కడ తనకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఎన్నికల ముందు భారాసలో చేరారు. దీంతో ఈయన సైతం మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు.
చివరి నిమిషంలో టికెట్ దక్కక..
మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందనుకున్న చలమల్ల కృష్ణారెడ్డి.. ఆ దిశగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే రాజగోపాల్రెడ్డి భాజపా నుంచి కాంగ్రెస్లో చేరడంతో కృష్ణారెడ్డికి నిరాశ ఎదురైంది. దీంతో ఆయన భాజపాలో చేరి.. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో ఆయన మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే