ముగిసిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
కరాటే విద్య వ్యక్తిత్వ వికాసానికి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డీఈవో భిక్షపతి తెలిపారు.
కరాటే పోటీల్లో గెలుపొందిన వారితో డీఈవో భిక్షపతి, క్రీడా ఉపాధ్యాయులు
నీలగిరి, న్యూస్టుడే: కరాటే విద్య వ్యక్తిత్వ వికాసానికి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డీఈవో భిక్షపతి తెలిపారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న అండర్ 14, 17 బాల బాలికల కరాటే పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారిని అభినందించారు. కరాటే శిక్షణ జీవితానికి ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో పాల్గొని విజేతలుగా నిలవాలని సూచించారు. రాష్ట్రం నుంచి జాతీయ పోటీలకు 45 మంది బాల బాలికలు ఎంపికయ్యారు. అండర్ 14 విభాగంలో బాలురు 10 మంది, బాలికలు 11 మంది, అండర్ 17 విభాగంలో బాలికలు 11 మంది, బాలురు 13 మంది ఎంపికయ్యారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్ కార్యదర్శి జి.వాసుదేవరావు, కరాటే అసోసియేషన్ కార్యదర్శి నరసింహాచారి, పవన్, విష్ణు, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు ప్రారంభం
మిర్యాలగూడ పట్టణం, మిర్యాలగూడ గ్రామీణం: రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్(స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) అండర్-14, 17 బాల, బాలికల ఫెన్సింగ్ క్రీడా పోటీలు మిర్యాలగూడ మండల పరిధిలోని శ్రీనివాస్నగర్లో బీసీ బాలికల గురుకుల పాఠశాల(దామరచర్ల)లో గురువారం ప్రారంభమయ్యాయి. పోటీలను జిల్లా విద్యాధికారి భిక్షపతి, గురుకులాల ఆర్సీవో షకీనా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. పోటీల నిర్వహణ కార్యదర్శి ఇందిర మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం నాలుగు విభాగాల్లో 384 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఇక్కడి పోటీలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన విజేతలు ఈ నెల 16న మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొంటారన్నారు. క్రీడాకారులతో పాటు శిక్షకులు, మేనేజర్లు మరో 64 మంది హాజరయ్యారని.. 10 మంది మ్యాచ్ రెఫరీలుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి, రాష్ట్ర పరిశీలకులు హరికృష్ణ(అండర్-17), ప్రభాకర్(అండర్-14), ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వాసుదేవరావు, మాజీ కార్యదర్శి కుంభం నర్సిరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్