ఎస్ఎల్బీసీ సొరంగంపై చిగురిస్తున్న ఆశలు
శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు పనులు ఈ ప్రభుత్వంలో పూర్తవుతాయన్న ఆశ ఉమ్మడి జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ హయాంలో మంజూరైనా.. నిధుల కటకటతో నిలిచిన పనులు
ఎస్ఎల్బీసీ సొరంగమార్గం ఔట్లెట్
ఈనాడు, నల్గొండ : శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు పనులు ఈ ప్రభుత్వంలో పూర్తవుతాయన్న ఆశ ఉమ్మడి జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు పైగా తాగునీరు ఇచ్చే ఉద్దేశంతో 2007లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో రూ.1,925 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ 16 ఏళ్లలో సుమారు రూ.2500 కోట్ల వరకు ఖర్చుచేయగా.. పెరిగిన ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.4776 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టు కోసం అప్పట్లో పోరాటం చేసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి తాజాగా మంత్రి పదవీ దక్కడంతో నిధుల సమస్యను ఆయన పరిష్కరిస్తారని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో కీలకమైన టన్నెల్ (సొరంగం) పనులు టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)లో ఏర్పడిన సాంకేతిక లోపాలు, విద్యుత్తు ఛార్జీలు, కార్మికుల బకాయిలు తదితర సమస్యల వల్ల గత ఏప్రిల్ నుంచి నిలిచిపోయాయి. దీంతో ఇక్కడ పనిచేస్తున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్, బిహార్, ఉత్తర్ప్రదేశ్, జమ్ము, కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన దాదాపు 300 మంది కార్మికులు సమ్మెకు దిగారు. దీనిని ఎంతకూ పరిష్కరించకపోవడంతో వారు స్వస్థలాలకు వెళ్లిపోయారు. మొత్తం 42 కి.మీ.ల సొరంగ మార్గానికి గానూ ప్రస్తుతం 33.5 కి.మీ. మేర పనులు పూర్తి చేశారు. ఏప్రిల్లో టీబీఎంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో దానికి కావాల్సిన బేరింగ్లను జర్మనీ నుంచి తెప్పించాల్సి ఉండగా.. అధికార యంత్రాంగం, గుత్తేదారుల నిర్లక్ష్యంతో అది మరుగున పడింది. తాజాగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
పదేళ్లలో రూ.500 కోట్ల మేర నిధులు
భారాస ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నిధుల కటకట వేధించింది. పదేళ్లలో కేవలం రూ.500 కోట్ల మేర మాత్రమే నిధులు విడుదల చేశారని కాంగ్రెస్ నాయకులు వెల్లడిస్తున్నారు. దీంతో ఈ నిధులు ఏ మూలకు సరిపోకపోవడంతో ప్రాజెక్టు పురోగతి ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి వెళ్లింది. ఏటా బడ్జెట్లోనూ నిధుల కేటాయింపు చేసినా అవి విడుదలకు నోచుకోకపోవడంతో కార్మికులకు, గుత్తేదారు కంపెనీకి నిరాశే మిగిలింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దీని కింద నిర్మాణం చేపట్టిన నక్కలగండి ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నక్కలగండిలో నిర్వాసితులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే ప్రాజెక్టులో నీటినిల్వ చేసుకోవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. సొరంగం పూర్తి చేసి నక్కలగండి ప్రాజెక్టును నింపితే దేవరకొండతో పాటూ మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలకు నీటి సమస్య తీరనుంది. ‘ ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి రివ్యూ చేస్తాం. తక్షణం ఎన్ని నిధులు అవసరం అవుతాయి..ప్రాజెక్టు పూర్తికి ఎంత మొత్తం అవసరం అవుతాయనే వివరాలతో పాటూ ప్రాజెక్టు పరిస్థితిపై ఓ నివేదిక తయారు చేస్తాం. అనంతరం దాన్ని ప్రభుత్వానికి అందజేస్తా’’మని సంబంధిత అధికారి ‘ఈనాడు’కు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం