TS News: తెలంగాణ అరకు.. ఐలాండ్ను తలపించే వైజాగ్కాలనీ
కొన్ని అద్భుత దృశ్యాలు చూడాలే గానీ మాటలకు అందవు. వాటి మధ్య గడిపితే అలసట అన్పించదు.
వైజాగ్కాలనీ
దేవరకొండ, న్యూస్టుడే: కొన్ని అద్భుత దృశ్యాలు చూడాలే గానీ మాటలకు అందవు. వాటి మధ్య గడిపితే అలసట అన్పించదు. అలాంటిదే అందమైన కృష్ణాతీరాన్ని ఆవరించి ఉన్న దేవరకొండ నియోజకవర్గం. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కృష్ణాపరివాహక ప్రాంతం.. నల్లమల అభయారణ్యంలో ఐదు జిల్లాలను విస్తరించిన కృష్ణపట్టి ఏరియా తీర ప్రాంతాన్ని చూసి ప్రకృతి ప్రేమికులు మంత్ర ముగ్ధులవుతున్నారు. దీంతో పాటు దేవరచర్ల ఆలయాన్ని పలువురు సందర్శిస్తున్నారు.
తెలంగాణ అరకుగా గుర్తింపు ఎప్పుడో..?
నల్లమల అభయరణ్యంలో సహజసిద్ధ ప్రకృతి అందాలతో అలరారుతూ నిత్యం జలాభిషేకంతో పూజలు అందుకుంటున్న శివన్న దర్శనానికి భక్తులు పెద్దఎత్తున వస్తుంటారు. రంగారెడ్డి, నాగర్కర్నూల్, హైదరాబాద్ జిల్లాల నుంచి దైవదర్శనానికి భక్తులు వస్తుండడంతో దేవరచర్ల కిటకిటలాడుతుంది. దేవరచర్ల గ్రామ శివారులో మునిస్వామి గుట్టపై క్రీస్తుశకం 13వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయకులు నిర్మించిన అతి పురాతన శివాలయం ఉంది. ఇంతటి ప్రాముఖ్యం గత పురాతన శివాలయాన్ని గతంలో సందర్శించిన దేవాదాయశాఖ అధికారులు తెలంగాణ అరకుగా పేరు పెట్టారు. చందంపేట మండల కేంద్రం నుంచి తెల్దేవరపల్లికి వెళ్లే మార్గంలో ఈ దేవాలయం ఉంది.
ఐలాండ్ను తలపించే వైజాగ్కాలనీ
నియోజకవర్గ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణపట్టి తీరాన్ని ఆవరించి ఉన్న వైజాగ్కాలనీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్కాలనీ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. సాయంత్రం వేళ.. ఆకర్షణీయంగా ద్వీపకల్పంలా కనువిందు చేస్తున్నాయి. మూడు దిక్కుల నీరుండి మధ్యలో వైజాగ్కాలనీ గ్రామం ఉండడంతో ద్వీపకల్పాన్ని తలపిస్తుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని సందర్శకులు కోరుతున్నారు. నేరెడుగొమ్ము మండల పరిధిలో ఉండే వైజాగ్కాలనీ దేవరకొండ - డిండి ప్రధాన రహదారి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో చిన్నమునిగల్ దగ్గర ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులన్నీ నీళ్లకే..!
[ 26-07-2024]
ఏళ్లుగా నిర్మాణం కొనసాగుతున్న ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఏఎమ్మార్ - ఎస్ఎల్బీసీ)కి మహర్దశ పట్టనుంది. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-2025) ప్రవేశపెట్టిన -
కాల్వలపై నిర్లక్ష్యం.. కనుమరుగైన లక్ష్యం
[ 26-07-2024]
ఏఎమ్మార్పీ కాల్వలు నిర్మించి దశాబ్దన్నర దాటిపోయింది. అప్పటి నుంచి కాల్వలకు మరమ్మతులు మరిచిపోయారు. దీంతో కాల్వలు పొదలతో నిండిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. -
సరిహద్దులో సైనికుడు.. భారత్కు రక్షకుడు
[ 26-07-2024]
భారత సైన్యం సాధించిన విజయాల్లో కార్గిల్ యుద్ధం అతి ముఖ్యమైనది. కశ్మీర్ను ఆక్రమించుకునేందుకు పాకిస్థాన్పై 1999 మే 3న ప్రారంభమైన యుద్ధం 73 రోజుల పాటు సాగింది. -
బడ్జెట్పై ఎవరేమన్నారంటే..!
[ 26-07-2024]
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని తాజా బడ్జెట్తో తేలిపోయింది. ఇది తిరోగమన బడ్జెట్. ఆరు గ్యారంటీలను అటకెక్కించేలా ఉంది. -
పల్లె నుంచే సాగాలి.. పతకాల వేట
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరాలు శుక్రవారం నుంచి ఆరంభమవుతున్నాయి. పారిస్ వేదికగా జరగనున్న ఈ క్రీడా పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 206 దేశాల నుంచి దాదాపు 10 వేల మంది క్రీడా దిగ్గజాలు పాల్గొంటున్నారు. -
నీటికుంటలో పడి బాలుడి మృతి
[ 26-07-2024]
నీటికుంటలో పడి బాలుడు మృతి చెందిన ఘటన నూతనకల్ మండలంలోని బిక్కుమళ్లలో గురువారం జరిగింది. గ్రామస్థులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
గృహ జ్యోతికి ఇంకా ఎన్ని రోజులో..!
[ 26-07-2024]
గృహజ్యోతి పథకానికి కొంత మంది లబ్ధిదారుల దూరంగా ఉంటున్నారు. కొన్ని సమస్యల కారణంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందలేక అష్టకష్టాలు పడుతున్నారు. -
గంజాయిపై ఉక్కుపాదం..!
[ 26-07-2024]
సూర్యాపేట జిల్లాలో గంజాయి వినియోగం, రవాణా చేస్తున్న సుమారు 250 మందిపై పోలీసులు హిస్టరీ షీటర్ (నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా) రికార్డుల్లో పేర్లు నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించారు. -
ఈ ఏడాదే వైద్య కళాశాల ఏర్పాటు
[ 26-07-2024]
యాదాద్రి ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు జాతీయ వైద్యమండలి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఎన్ఎంసీ బృందం పరోక్ష తనిఖీ సందర్భంగా లేవనెత్తిన అభ్యంతరాలు -
కదులుతున్న దస్త్రాలు.. ఆపేందుకు పైరవీలు
[ 26-07-2024]
రాష్ట్రంలో ఆర్జేసీ హోదా కలిగిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయాలకు చెందిన ఉద్యోగులతో పాటు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్