తప్పుడు పోస్టులకు తప్పదు మూల్యం.. తెలియదంటే కుదరదు..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల క్రతువు దగ్గర పడుతుండటంతో వాట్సప్, ఫేస్బుక్లో అభ్యర్థులు, పార్టీల అభిమానులు చురుగ్గా ఉంటున్నారు.
నాంపల్లి, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల క్రతువు దగ్గర పడుతుండటంతో వాట్సప్, ఫేస్బుక్లో అభ్యర్థులు, పార్టీల అభిమానులు చురుగ్గా ఉంటున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సైబర్ క్రైం విభాగం సామాజిక మాధ్యమాల్లో జరిగే కార్యకలాపాలపై నిఘా పెట్టి చట్ట వ్యతిరేక అంశాలను గుర్తించి సుమోటాగా కేసులు నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
- సామాజిక మాధ్యమాల్లో గ్రూపు అడ్మిన్ పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా తప్పుడు ప్రచారం జరిగితే తనకు తెలియదంటే కుదరదు.
- వాట్సప్, ఫేస్బుక్లో ప్రతి పోస్టింగ్కు అడ్మిన్ బాధ్యత తీసుకోవడంతో పాటు గ్రూపులో ప్రతి సభ్యుడి పేరు, చిరునామా తెలిసి ఉండాలి.
- సభ్యులను గ్రూపులో చేర్చుకునే ముందు వారి అనుమతి తీసుకోవాలి.
- నిబంధనలకు విరుద్ధంగా గ్రూపులో పోస్టులు పెట్టే సభ్యులను తొలగించి స్థానిక పోలీసులకు తెలియజేయాలి.
- అడ్మినే వివాదాస్పద, అభ్యంతరకర, వర్గాలను రెచ్చగొట్టేలా పోస్టింగులు పెడితే ఐటీ చట్టం ఐపీసీ సెక్షన్ 153(ఎ) కింద కేసు నమోదు చేస్తారు. 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
- అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులను గుర్తించారు. వారు పెట్టిన పోస్టు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
- నిబంధనలు పాటించకుండా వ్యవహరించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద చరవాణి ఉంది. సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి పోస్టులు పెడితే తిప్పలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పార్టీలు, అభ్యర్థుల గొప్పతనం చెప్పుకునే క్రమంలో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థులను కించపరిచేలా, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టేలా వాయిస్ మెసేజ్లు, ఫొటోల మార్ఫింగ్, వాస్తవ విరుద్ధంగా అభ్యంతరకర పోస్టులు పెట్టినా, వారికి మద్దతిస్తూ కామెంట్లు చేసినా కేసులు నమోదు చేస్తారు. సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే తాయిలాల పంపిణీపై నిఘా ఉంచారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఐటీ చట్టం, ఐపీసీలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద చరవాణి ఉంది. సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి పోస్టులు పెడితే తిప్పలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పార్టీలు, అభ్యర్థుల గొప్పతనం చెప్పుకునే క్రమంలో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థులను కించపరిచేలా, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టేలా వాయిస్ మెసేజ్లు, ఫొటోల మార్ఫింగ్, వాస్తవ విరుద్ధంగా అభ్యంతరకర పోస్టులు పెట్టినా, వారికి మద్దతిస్తూ కామెంట్లు చేసినా కేసులు నమోదు చేస్తారు. సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే తాయిలాల పంపిణీపై నిఘా ఉంచారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఐటీ చట్టం, ఐపీసీలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.
అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు
మేళ్లచెరువు, న్యూస్టుడే: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలొచ్చినప్పుడల్లా ఎక్కువ శాతం గతంలో పోటీ చేసిన వారే బరిలో కన్పిస్తుంటారు. కాకపోతే కొందరు పార్టీలు మారి కన్పిస్తారు. మరికొందరు అసెంబ్లీ నుంచి లోక్సభ, లోక్సభ నుంచి అసెంబ్లీకి వెళ్లాలన్న లక్ష్యంతో పోటీ చేస్తుంటారు. ఈసారి నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి పరిస్థితులే కన్పించాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గ భారాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై ఉత్తమ్కుమార్రెడ్డి (కాంగ్రెస్) గెలుపొందారు. తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో నల్గొండ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా ఉత్తమ్ విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మళ్లీ 2019లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి (కాంగ్రెస్)పై భారాస అభ్యర్థి సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా నిలబడిన సైదిరెడ్డిపై మళ్లీ ఉత్తమ్కుమార్రెడ్డి (కాంగ్రెస్) గెలుపొందారు. ఓటమి పాలైన సైదిరెడ్డి ఇటీవలే భాజపాలో చేరారు. ఉత్తమ్ హుజూర్నగర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగుతుండగా, ఈసారి భాజపా నల్గొండ లోక్సభ అభ్యర్థిగా సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. నిన్న ఎంపీ స్థాయిలో ఉండి అసెంబ్లీ స్థానం వైపు ఉత్తమ్ ఆసక్తి చూపగా, ఎమ్మెల్యేగా ఓటమిపాలై నేడు ఎంపీ స్థానానికి సైదిరెడ్డి పోటీ పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ