logo

తెదేపాలో చేరిన వైకాపా రాష్ట్ర మహిళా సంయుక్త కార్యదర్శి

వైకాపా రాష్ట్ర మహిళా సంయుక్త కార్యదర్శి పెరుమాళ్ల  పద్మజా యాదవ్‌తోపాటు మరికొంతమంది ఆ పార్టీకి రాజీనామా చేసి తెదేపాలో చేరారు. 

Published : 12 Apr 2024 11:36 IST

నెల్లూరు కలెక్టరేట్‌: వైకాపా రాష్ట్ర మహిళా సంయుక్త కార్యదర్శి పెరుమాళ్ల  పద్మజా యాదవ్‌తోపాటు మరికొంతమంది ఆ పార్టీకి రాజీనామా చేసి తెదేపాలో చేరారు.  నెల్లూరు రూరల్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, ఆ పార్టీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు.  ఈ సందర్భంగా  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి తెదేపాలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ  పద్మజా యాదవ్ ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా అంకిత భావంతో పని చేస్తారని తెలిపారు.  తెదేపా కూటమి అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని  ప్రజల ఆకాంక్ష అని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని