అంకమ్మతల్లి ఆలయంలో ప్రెస్మీటా..?
నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్యాదవ్, స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డితో కలిసి అంకమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయంలో విలేకరుల సమావేశంలో
విజయసాయిరెడ్డి, పక్కనే మధుసూదన్యాదవ్, మానుగుంట మహీధర్రెడ్డి
కందుకూరు గ్రామీణం, న్యూస్టుడే: నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్యాదవ్, స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డితో కలిసి అంకమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలోనే విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి.. అమ్మవారి బంగారు కిరీటానికి రూ.40 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్యాదవ్ ఆలయ నిర్మాణానికి రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. అంకమ్మతల్లి.. తమను ఎన్నికల్లో గెలిపించాలని కోరుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి కందుకూరు అభివృద్ధికి పాటుపడతారనే నమ్మకం ఉందన్నారు. బుర్రా మధుసూదన్యాదవ్ ఇక్కడ వైకాపా తరఫున(రాజకీయాలు దేవాలయంలో మాట్లాడకూడదంటూనే) పోటీలో ఉన్నారనీ, వీరిద్దరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. సీఎం జగన్ సహకారంతో.. ఆలయ నిర్మాణానికి దేవాదాయ, ధర్మాదాయశాఖ నుంచి రూ.1.15 కోట్లు మంజూరైనట్లు వివరించారు. ఇప్పటికే రూ.6.40 కోట్లతో ఆలయ నిర్మాణం, రూ.3.50 కోట్లతో అలివేటి మండపం నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే