ప్రభుత్వ భూములు దర్జాగా కబ్జా
వింజమూరు మండలంలో అధికార వైకాపా నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మకై కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు.
న్యూస్టుడే, వింజమూరు
ఆక్రమణలు పరిశీలిస్తున్న కావలి ఆర్డీవో శీనానాయక్
వింజమూరు మండలంలో అధికార వైకాపా నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మకై కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. మండల కేంద్రం చుట్టుపక్కల సుమారు 5 కి.మీ. పరిధిలో ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేసి దాదాపు వంద కోట్లకు పైగా దోచుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఆక్రమణలున్న ప్రాంతాలను కావలి ఆర్డీవో శీనానాయక్ సిబ్బందితో కలసి గతంలో పరిశీలించారు. సర్వే చేసి వాటిని గుర్తించి నివేదిక తయారు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించిన వాటిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటి వరకు ఆ విషయమై సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటిస్తున్నారే తప్ప ఆచరణలో కనిపించడం లేదు.
- మండలంలోని కాటేపల్లి, తక్కెళ్లపాడు, బత్తినవారిపల్లి, గుండెమడకల తదితర గ్రామాల్లో నేటికీ ప్రభుత్వ భూముల ఆక్రమణలున్నాయి. కాటేపల్లిలో సుమారు 1,277 ఎకరాల భూమి బడా రైతుల చెరలో ఉంది. ఈ భూమిపై 145 సెక్షన్ ఉన్నా ఇంత వరకు చర్యలు లేవు. ప్రభుత్వ భూముల్లో బోర్లు వేసి విద్యుత్తు కనెక్షన్లు కూడా తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు.
- వింజమూరు చుట్టుపక్కల 5 కి.మీ.ల పరిధిలోని ప్రభుత్వ భూములపై సర్వేయర్, వీఆర్వోల ద్వారా సర్వే చేయించి నివేదిక తయారు చేయాలన్న ఆర్డీవో ఆదేశాలు అమలు కాలేదు. ఈ ప్లాట్లు చేతులు మారాయి. కావలి- ఉదయగిరి రోడ్డులో మల్లపరాజువాగు ఆనుకుని ఉన్న భూమిలో వేసిన లేఅవుట్లో ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు పలువురి చేతులు మారాయి. అత్యంత విలువైన ఈ ప్లాట్లు అప్పట్లో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది కనుసన్నల్లో వారి అనుయాయులకు కేటాయించారనే విమర్శలున్నాయి. ఆయా ప్లాట్లలో జరిగిన భారీ నిర్మాణాలను కూడా అధికారుల బృందం పరిశీలించింది. కొన్నిచోట్ల కొందరు ఆక్రమించి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అలాంటి వారిపై కౌంటర్ వేయించి వాటిని వెకేట్ చేయించి ఆ భూములను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించి ఉన్నారు.
చర్యలు తీసుకుంటాం ఎంవీ కృష్ణారెడ్డి, తహసీల్దారు
ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయం నా దృష్టికి వచ్చింది. నోటీసులు అందుకున్న వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చట్టపరంగా ముందుకు వెళుతున్నాం. భూములు పరాధీనం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నా. కాటేపల్లి తదితర గ్రామాల్లో ఆక్రమణల విషయం నా దృష్టికి రాలేదు. ఆక్రమణలో ఉన్న భూముల వివరాలు తెలుసుకుని ప్రభుత్వ స్వాధీనానికి చర్యలు తీసుకుంటా.
అసైన్డ్ భూముల్లో లే అవుట్ల అక్రమాలపై అధికారులు ఇటీవల కొందరికి నోటీసులు ఇచ్చారు. ఇవి తీసుకున్న వారిలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు విచారించి లేఅవుట్లు వేసిన కొన్ని అసైన్డ్ భూములు రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నోటీసుల్లో 27.75 ఎకరాల భూమిని పేర్కొన్నారు. 129-1, 129-3, 130-1, 131-1, 132-3, 132-4, 132-6, 132-7, 133-2, 133-4, 127-1, 127-2 సర్వే నంబర్లలో సుమారు 40 ఎకరాల్లో లేఅవుట్లు వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తమిళనాడు నుంచి వచ్చి వేటాడుతున్న వారిని తక్షణమే అడ్డుకోవాలి: మంత్రి కొల్లు రవీంద్ర
[ 26-07-2024]
తమిళనాడు నుంచి నెల్లూరు జిల్లా పరిధిలోని తీర ప్రాంతాలకు వచ్చి వేటాడుతున్న వారిని తక్షణమే అడ్డుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ను ఆదేశించారు. -
బిట్రగుంట సమీపంలో మళ్లీ పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-07-2024]
బిట్రగుంట స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
కదిలింది దస్త్రం.. తీసేనా అస్త్రం
[ 26-07-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న అయిదేళ్లు.. నాటి ప్రజాప్రతినిధుల అండతో నెల్లూరు రూరల్ మండలంలోని కొందరు రెవెన్యూ సిబ్బంది రెచ్చిపోయారు. -
ఎర్రచందనం రక్షణకు ప్రత్యేక రేంజ్
[ 26-07-2024]
సోమశిలలో ప్రత్యేక రేంజ్ ఏర్పాటుకు అటవీశాఖ కసరత్తు చేస్తోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధంపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం.. అందుకు ప్రతిబంధకాలు, చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాలపై అధికారుల నుంచి నివేదిక కోరింది. -
కదలని బండి.. ప్రజాధనానికి గండి
[ 26-07-2024]
నెల్లూరు నగర పరిశుభ్రతే లక్ష్యంగా గత ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద ఇచ్చిన ఆటోల్లో సగానికి పైగా పడకేయగా.. అంతకుముందు స్వచ్ఛాంధ్ర మిషన్ కింద ఇచ్చిన ఖరీదైన యంత్రాలు మూలనపడ్డాయి. -
తొలగించినా.. అదే ముసుగు
[ 26-07-2024]
ఒప్పంద వాచర్ల కదలికలపై అనుమానంతో నిఘాపెట్టి వారిపై చర్యలు తీసుకున్నా.. అక్రమాల దందా ఆగలేదు. అక్రమార్కులతో చేతులు కలిపి.. వారే ఎర్రచందనాన్ని సురక్షితంగా అడవిని దాటిస్తూ.. పట్టుబడ్డారు. -
నేల తల్లికి జీవం
[ 26-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా సాగిన భూసార పరీక్షల్లో.. మళ్లీ కదలిక వచ్చింది. రైతులకు ఎంతో ప్రయోజనకరమైన వీటిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొదించింది. -
నగరపాలక సంస్థలో పోలీసుల సోదాలు
[ 26-07-2024]
నగరపాలక సంస్థలో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
దేశమాత రక్షకులు.. దేవిశెట్టిపల్లి బిడ్డలు
[ 26-07-2024]
అదో కుగ్రామం.. మారుమూల పల్లె. అందరిలోనూ దేశభక్తి. దేశమాత రక్షణకు పాటుపడాలన్న తపన. -
అతివకు.. ఉపాధి బాట
[ 26-07-2024]
ప్రస్తుతం పుట్టినరోజు వేడుకల నుంచి ప్రతి శుభకార్యానికి మహిళలు అలంకరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. -
నాకు లేని సంతోషం అన్నకెందుకు..!
[ 26-07-2024]
నాకు దూరమైన కుటుంబ బంధం.. గౌరవం అన్నకూ దక్కకూడదు. ఇష్టంలేని పెళ్లి చేసి నా గొంతు కోశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50 చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?