18 నుంచి నామినేషన్ల ప్రక్రియ
: ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తవుతుందని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ ఎం.హరినారాయణన్
లెక్కింపు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ హరినారాయణన్
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తవుతుందని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీకి సంబంధిత ఆర్వో కార్యాలయం, లోక్సభకు కలెక్టరేట్లోని ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఆర్వో కార్యాలయం గేటు నుంచి 100 మీటర్ల వరకే వాహనాలకు అనుమతి ఉంటుందన్నారు. అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే అనుమతి ఉందన్నారు. ఇప్పుడు తీసుకున్న వాహనాలకు అనుమతులన్నీ ఈ నెల 17వ తేదీ సాయంత్రానికి ముగుస్తాయన్నారు. 18 నుంచి పార్టీ అధ్యక్షుడికి మాత్రమే ఒక వాహనానికి అనుమతి ఉంటుందన్నారు. ప్రచారంలో వినియోగించే వాహనాలకు కూడా అనుమతి తీసుకోవాలన్నారు. అంతకుముందు కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి.. సూచనలు చేశారు. డీఆర్వో లవన్న, ఈవీఎం నోడల్ అధికారి పద్మాదేవి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, కలెక్టరేట్ ఏవో మధుసూదనశర్మ, వైకాపా, తెదేపా, భాజపా, సీపీఐ ప్రతినిధులు మురళీధర్రెడ్డి, జి.నారాయణ, రసూల్, సురేంద్రబాబు, శ్రీనివాస్, అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు