మరోసారి.. మరింత దిగజారి
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులైనా.. ర్యాంకుల్లో జిల్లా వెనుకబడింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 8వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో ఆరో స్థానం దక్కింది.
ప్రథమంలో 8, ద్వితీయలో 6వ స్థానం
నెల్లూరు(విద్య), న్యూస్టుడే: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులైనా.. ర్యాంకుల్లో జిల్లా వెనుకబడింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 8వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో ఆరో స్థానం దక్కింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 69శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం ఫలితాలు సాధించారు. కరోనాకు ముందు రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో ఉండగా- ఆ తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది. ఫలితాల్లో బాలుర కంటే బాలికల హవా కొనసాగింది.
ద్వితీయ సంవత్సరంలో...21,293 మంది పరీక్షలు రాయగా.. 17,292 మంది ఉత్తీర్ణులై 81 శాతంగా, వృత్తి విద్యా కోర్సుల్లో 1074 మంది పరీక్ష రాయగా.. 769 మంది ఉత్తీర్ణులై.. 72శాతంగా నమోదైంది.
ప్రథమలో... 24,620 మంది పరీక్షలు రాయగా.. 17,100 మంది ఉత్తీర్ణులై.. ఫలితం 69 శాతంగా.. వృత్తివిద్యా కోర్సుల్లో 1,009 మంది రాయగా.. 647 మంది ఉత్తీర్ణులై 64 శాతంగా నమోదైంది.
బాలికలు 72 శాతం ఉత్తీర్ణత.. ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. మొదటి సంవత్సరంలో బాలికలు 11,790కు 8,464 మంది ఉత్తీర్ణత సాధించి 72 శాతం, బాలురు 12,830కి 8,636 మంది ఉత్తీర్ణులై 67 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 10,473కు 8,797 మంది ఉత్తీర్ణులై 84 శాతం, బాలురు 10,820కి 8,495 మంది ఉత్తీర్ణులయ్యారు. 79 శాతంగా నమోదైంది.
మంచి ఫలితాలు
డాక్టర్ ఎ.శ్రీనివాసులు ఆర్ఐవో
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంప్రూమెంట్ రాసే వారికి మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు పరీక్షలు రెండు పూటలా ఉంటాయి. పరీక్ష ఫీజు ఈ నెల 18 నుంచి 24లోపు చెల్లించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం