గడువు లేదు.. ఓటరూ మేలుకో..
సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. పాలకులను ఎన్నుకునే తరుణం ఆసన్నమైంది. మనం వేసే ఒక్క ఓటు గెలుపోటములను నిర్ణయిస్తుంది.
ఓటు హక్కు నమోదుకు రెండు రోజులే
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. పాలకులను ఎన్నుకునే తరుణం ఆసన్నమైంది. మనం వేసే ఒక్క ఓటు గెలుపోటములను నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో సరిచూసుకోవాలి. లేకుంటే వెంటనే ఓటు నమోదు దరఖాస్తు (ఫారం-6) చేసుకోవాలి. ఈనెల 14వ తేదీ వరకే గడువు ఉండటంతో అర్హులంతా మేలుకోవాలి. లేకుంటే ఓటేసే పరిస్థితి ఉండదు. ఉత్తమ నాయకులను ఎన్నుకునే అవకాశం కోల్పోతారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో 8 అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటరు జాబితాలో పేరు ఉండాలి. లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 14వ తేదీ రాత్రి వరకు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. యువత అత్యంత కీలకం. ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. అందిన దరఖాస్తులు విచారించి ఓటు హక్కు కల్పిస్తారు.
యువ ఓటర్లే కీలకం
జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారు నమోదు చేసుకోవాలి. ఇటీవల విడుదలైన జాబితాను పరిశీలిస్తే జిల్లాలో 18-19 వయసు ఓటర్లు 36,175 మంది ఉన్నట్లు తేలింది. 40-49 ఏళ్ల వారు అత్యధికంగా 4,29,668 మంది ఉన్నారు. యువతతో పాటు ఓటు హక్కు లేని ఇతర వయసుల వారు కూడా దరఖాస్తు చేసుకుని రానున్న ఎన్నికల్లో పాల్గొనాలని యంత్రాంగం కోరుతోంది.
ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం..
ఎన్నికల సంఘం ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు నాలుగు విధానాలు ఉన్నాయి. వెబ్సైట్లో మీ చరవాణి నంబరుతో రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాలి.
- www.nvsp.in వెబ్సైట్లోకి వెళ్లి తొలుత మీ ఫోను నంబరుతో రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాలి.
- https://voters. eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లి తొలుత మీ ఫోను నంబరుతో రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయి వెబ్సైట్లోకి ప్రవేశించిన వెంటనే ‘న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకుంటూ వెళ్లి దరఖాస్తుతో అడిగిన వివరాలన్నీ నింపి సబ్మిట్ చేయవచ్చు.
- ప్లేస్టోర్లో భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన voterhelpline మొబైల్ యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీఫోను నంబరు వివరాలు పొందుపర్చి రిజిస్టర్ చేసుకోవాలి. వాటి ఆధారంగా లాగిన్ కావాలి.
- https:// ceoandhra.nic.in వెబ్సైట్లో సైతం ఎన్వీఎస్పీ ఓటర్ పోర్టల్ వెబ్సైట్ లింకుల్లోకి వెళ్లి హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎల్వోల పరిశీలన తర్వాత కార్డు వస్తుంది.
నేరుగానూ ఇవ్వొచ్చు
ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు. నేరుగా బూత్ స్థాయి అధికారులకు (బీఎల్వోలకు) అందజేయాలి. ఫారం-6 దరఖాస్తు సమర్పించి హక్కు కోరవచ్చు. ప్రతి నియోజకవర్గానికి డివిజన్ స్థాయి అధికారిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో)గా ఎన్నికల సంఘం నియమించింది. వారి కార్యాలయాల్లోనూ దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ప్రతి మండలంలోనూ తహసీల్దారు లేదా డిప్యూటీ తహసీల్దారును అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్వోలు)గా నియమించింది. వారి కార్యాలయాలనూ సంప్రదించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీజనల్ వ్యాధులపై అవగాహన
[ 27-07-2024]
కొవ్వూరు : మండలంలోని పొడుగుపాడు సచివాలయం-1 పరిధిలోని ఈరోజు గుంటూరు జోనల్ అదనపు డైరెక్టర్ జి. వీర్రాజు ఆధ్వర్యంలో బృందము దోమల లార్వాలను పరిశీలించారు. -
మాజీ ఎమ్మెల్యేను సన్మానించిన కోటంరెడ్డి బద్రర్స్
[ 27-07-2024]
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కావలి మాజీ ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారు. -
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు