గడప గడపన జగన్నాటకం!
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం..
బిల్లుల చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యం
ప్రతిపాదిత పనుల్లో సగానికి పైగా మొదలే కాని వైనం
ప్రచారంలో నిలదీస్తారని వైకాపా ఎమ్మెల్యేలు, అభ్యర్థుల్లో గుబులు
ఈనాడు, నెల్లూరు
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. పరిష్కారానికి కృషి చేయడం తదితరాలు చేయాలని నిర్ణయించింది. 2022, మే 11వ తేదీ కార్యక్రమం ప్రారంభం కాగా- ప్రతి వీధిలో సమస్యలు వెల్లువెత్తాయి. ప్రతిచోటా తమ ప్రాంతంలో కనీస సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్ వినిపించింది. మంచినీరు, రహదారులు, మురుగు కాలువల నిర్వహణ తీరుపై ఎక్కువగా నిలదీశారు. ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు అర్హులకు అందడం లేదన్న ఆవేదన ప్రజల నుంచి వ్యక్తమైంది. దీంతో కొందరు ఎమ్మెల్యేలు.. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చిన కరపత్రాలను పంపిణీ చేయడంతోనే సరిపెట్టారు. పలు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా.. వాటిలో చాలా వాటి పరిస్థితి నేటికీ మారలేదు.
నాలుగేళ్లపాటు గ్రామ, పట్టణాలను ఎంతో నిర్లక్ష్యం చేసిన ముఖ్యమంత్రికి.. ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనగా ప్రజలు గుర్తొచ్చారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో వార్డు సచివాలయానికి రూ. 40 లక్షలు, గ్రామ సచివాలయానికి రూ. 20 లక్షల చొప్పున ఇస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. ఆ మేరకు నిధులు విడుదల చేశారా? పనులు పూర్తి చేయించారా? అంటే.. లేదనే సమాధానమే వస్తోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 688 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 5,734 పనులు గుర్తించారు. వాటికి రూ. 234 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఎక్కువ పనులను ఎమ్మెల్యేల సిఫార్సులపై నామినేషన్ పద్ధతిలో కేటాయించారు. కొన్ని ప్రాంతాల్లో టెండర్లు పిలవగా- గుత్తేదారుల నుంచి స్పందన లేదు. ఈ ప్రభుత్వంలో ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకే ఇంకా జిల్లా వ్యాప్తంగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో.. కొత్తగా చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో 2,500 పనులు మాత్రమే పూర్తి చేశారు. దీనికి రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేయగా.. అందులో సుమారు రూ.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికీ పూర్తికాకపోవడంతో..
ఏడాది నుంచి పనులు చేపట్టినా.. అవి ఇప్పటికీ పూర్తికాకపోవడంతో.. ఆయా సమస్యల పరిష్కారానికి హామీలిచ్చిన వైకాపా ఎమ్మెల్యేలు, అభ్యర్థుల్లో ప్రస్తుతం గుబులు రేగుతోంది. చాలా సమస్యలు ప్రతిపాదించకపోవడం.. చేసిన వాటిలో సగం కూడా పూర్తికాకపోవడం.. చాలా అసంపూర్తిగా నిలిచిపోవడంపై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల వేళ.. ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతాయేమోనని హడలిపోతున్నారు. అలాగే, గ్రామాల్లో ఎలాంటి పనులు చేయాలన్నా పంచాయతీల తీర్మానం అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ పథకంలో పనుల గుర్తింపు, నిధుల కేటాయింపునకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయడం, అందులో సర్పంచికి స్థానం లేకుండా చేయడం తదితరాలతో ఇప్పుడు స్థానిక నాయకులు ఎన్నికల్లో ఎంత మేరకు సహకరిస్తారోనన్న గుబులు నెలకొంది.
అనంతసాగరం: అనంతసాగరం ఎస్సీ కాలనీలోని కాలువలివి. ఏళ్ల కిందట నిర్మించినవి కావడంతో అధ్వానంగా మారాయి. ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరు సక్రమంగా వెళ్లకపోవడంతో.. ఆ ప్రాంత వాసులు అవస్థలు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు, గడపగడపకు వచ్చిన ప్రజాప్రతినిధులకు విన్నవించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కందుకూరు: కందుకూరు పట్టణం ఐ.ఎస్.రావు నగర్లోనిదీ చిత్రం. కాలువలు సక్రమంగా లేకపోవడంతో.. మురుగునీరు ఇలా ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలోకి చేరి దుర్వాసన వస్తోంది. దోమలకు ఆవాసంగా మారింది. వైకాపా అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో పట్టణంలో కనీస అభివృద్ధి లేదు. 17 సచివాలయాలు ఉండగా- ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే తిరిగితే రూ. 40 లక్షల వరకు ఇస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్యే మహీధర్రెడ్డి పర్యటించిన ప్రాంతాల్లో ప్రజల నుంచి నిలదీతలు ఎదురు కావడంతో కందుకూరులో ఒక్క వార్డు కూడా తిరగలేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కోవూరు: సెయింట్పాల్ స్కూల్ రోడ్డు. ఈ మార్గంలో నిత్యం రెండు వేల మంది విద్యార్థులు వెళుతుంటారు. దీంతో పాటు కోవూరు నుంచి ఇనమడుగు వెళ్లే ప్రధాన రహదారి. వర్షమొచ్చిందంటే చాలు.. ఆ రోడ్డంతా మురుగునీటితో నిండిపోతుంది. ఈ సమస్యపై స్థానికులు పంచాయతీ అధికారులు, పాలకులకు ఎన్నో సార్లు విన్నవించారు. పట్టించుకున్న పరిస్థితి లేదు. కనీసం గడప గడపకు మన ప్రభుత్వం నిధులతోనైనా చేస్తారనుకున్నా.. అడుగు పడలేదు.
జరిగిన అభివృద్ధి శూన్యం
- జి.వెంకట్రావు, కందుకూరు
గత అయిదేళ్లలో కందుకూరులో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. రోడ్లు, కాలువల నిర్మాణాన్ని సైతం గాలికి వదిలేశారు. పన్నులు కట్టించుకోవడంపై ఉన్న శ్రద్ధ.. మౌలిక సదుపాయాలపై లేదు. రోడ్లపై మురుగు తాండవిస్తోంది. చెత్తా చెదారంతో కాలువలు నిండి దుర్వాసన వస్తోంది. ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం