పేరుకే రైతు భరోసా
అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ఉద్దేశించిన రైతు భరోసా కేంద్రాలు ఆచరణలో నిరాశ కలిగిస్తున్నాయి. త్వరలో ఖరీఫ్ సీˆజన్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అధికారులకు సరైన ప్రణాళికలు లేవనే విమర్శలు వస్తున్నాయి.
సేవల్లో నిరాశ
ఆర్బీకేల తీరు
కలిగిరిలో అసంపూర్తిగా ఆర్బీకే భవనం
అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ఉద్దేశించిన రైతు భరోసా కేంద్రాలు ఆచరణలో నిరాశ కలిగిస్తున్నాయి. త్వరలో ఖరీఫ్ సీˆజన్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అధికారులకు సరైన ప్రణాళికలు లేవనే విమర్శలు వస్తున్నాయి. సాగు ప్రోత్సాహకాల్లో కోత తదితర చర్యలతో ఇంకెన్ని అవస్థలు పడాల్సి వస్తోందోనన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
దుత్తలూరు, న్యూస్టుడే : అన్నదాతకు అవసరమైన అన్ని సేవలు రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకేలు) ద్వారానే అందిస్తామని ప్రారంభంలో పాలకులు ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో 37 మండలాల పరిధిలో 561 రైతు భరోసా కేంద్రాలున్నాయి. ఏటా ఖరీఫ్లో 59 వేల హెక్టార్లకుపైగా రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు.
- యంత్రసేవ పథకంలో భాగంగా జిల్లాలోని 614 రైతు బృందాలకు రూ. 66.40 కోట్ల వ్యయంతో 4,314 వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. ఆర్బీకే పరిధిలో అయిదుగురు వంతున రైతు బృందాలకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వేస్టర్లు, రొటోవేటర్లు, వరినాట్లు, దుక్కి, కోత, నూర్పిడి యంత్రాలు అందజేశారు. యంత్రాలు తీసుకున్న రైతులు వారి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుని... ఆపై అవసరార్థులకు నామమాత్రపు నగదు తీసుకుని పనులు చేయాలి. క్షేత్రస్థాయిలో ఇది ఎక్కడా అమలుకావటంలేదు.
- ఆర్బీకేల పరిధిలో ఎన్ని యంత్రాలు ఉన్నాయి. వాటిని ఎంతమంది వినియోగించాలి... ఏఏ పనులకు ఎంత నగదు వసూలు చేయాలనే అంశాలను అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో ఈ పథక లక్ష్యం పూర్తిగా దారి తప్పింది. యంత్ర సేవా పథకం వైకాపా అనుయాయులకే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి.
- ఆర్బీకేల్లో పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఈ క్రమంలో రైతులకు సకాలంలో సాగు సలహాలు, సూచనలపై సరైన సమాధానం లేదని రైతులు విమర్శిస్తున్నారు.
- తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతి సీˆజన్లో పొలంబడి నిర్వహించారు. రైతులకు వ్యవసాయాధికారులు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ప్రతి వేసవి కాలంలో మట్టి నమూనాలు సేకరించి రైతులకు వివరించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పథకాన్ని వైఎస్ఆర్ పొలంబడిగా మార్చారు. ఇదే సందర్భంలో నిధులకు మంగళం పాడారు. ఫలితంగా గ్రామాల్లో పొలంబడి కార్యక్రమాలు పూర్తిగా అటకెక్కాయి.
నామమాత్రమే
- చంద్రశేఖర్, రైతు, వరికుంటపాడు
రైతు భరోసా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు లభిస్తామని అధికారులతోపాటు ప్రభుత్వం పేర్కొంది. క్రమంగా ఈ కేంద్రాల్లో అరకొరగానే సేవలు అందుతున్నాయి. రాయితీపై అందజేసిన వ్యవసాయ పరికరాలు సామాన్య రైతులకు అందుబాటులో ఉండటంలేదు. అధిక ధరలు వెచ్చించి బయట నుంచి బాడుగకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకు ఎంతో ఉపయోగ పడే పొలంబడి కార్యక్రమాన్ని పూర్తిగా అటకెక్కించారు. రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో సూచనలు, సలహాలు అందటం గగనంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీజనల్ వ్యాధులపై అవగాహన
[ 27-07-2024]
కొవ్వూరు : మండలంలోని పొడుగుపాడు సచివాలయం-1 పరిధిలోని ఈరోజు గుంటూరు జోనల్ అదనపు డైరెక్టర్ జి. వీర్రాజు ఆధ్వర్యంలో బృందము దోమల లార్వాలను పరిశీలించారు. -
మాజీ ఎమ్మెల్యేను సన్మానించిన కోటంరెడ్డి బద్రర్స్
[ 27-07-2024]
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కావలి మాజీ ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారు. -
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్