రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి సమయాన్ని అదనుగా చూసుకుని అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తోంది. మండలంలో భీమవరప్పాడు, సాయిపేట, ఇస్కదామెర్ల, గరిమెనపెంట తదితర ప్రాంతాల్లో ఇసుక రీచ్లను అధికారులు గుర్తించారు.
పోలీసులు పట్టుకున్న ట్రాక్టరు (పాతచిత్రం)
కొండాపురం, న్యూస్టుడే: మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి సమయాన్ని అదనుగా చూసుకుని అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తోంది. మండలంలో భీమవరప్పాడు, సాయిపేట, ఇస్కదామెర్ల, గరిమెనపెంట తదితర ప్రాంతాల్లో ఇసుక రీచ్లను అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచే భవన, వివిధ నిర్మాణాలకు సంబంధిత అధికారుల అనుమతితో ఇసుకను సరఫరా చేయాల్సి ఉంది. ఇదే సందర్భంలో ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇసుక మాఫియా మండలంలో రెచ్చిపోతోంది. పగలు సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను మాత్రమే అధికారులు పట్టుకోగలుగుతున్నారు. వీరి నుంచి తప్పించుకునేందుకు మాఫియా రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము 5 గంటలలోపు అక్రమ రవాణా సాగిస్తున్నారు. -
- ప్రస్తుతం ట్రక్కు ఇసుక సుమారు రూ. 4500 వరకు పలుకుతోంది. ఇతర మండలాలకు సరఫరా చేస్తే రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి సమయంలో రవాణాను కొనసాగిస్తూ పోలీసు, సెబ్ అధికారులకు టోకరా వేస్తున్నారు. ఇదే సందర్భంలో ఎవరైనా అధికారులకు సమాచారం అందజేస్తే కింది స్థాయి సిబ్బంది కొందరు మాఫియాకు చేరవేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
- ప్రధానంగా భీమవరప్పాడు, సాయిపేట గ్రామాల్లోని వాగుల నుంచి రాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు.
- ఈ విషయమై ఎస్సై మహేంద్ర వివణ కోరగా తమకు సమాచారం అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి మండల ప్రజల సహకారం అవసరమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ