కూర‘గాయాలు’
ఏం కొనలేం.. ఏం తినలేం అన్నట్లుంది.. సామాన్యుడి పరిస్థితి. మాంసం చేపల ధరలు పెరిగి పోవడంతో శాఖాహారిగా మారుతున్నారు. చివరకు కూరగాయల ధరలు కూడా ఆకాశానంటుతున్నాయి. కిలో చికెన్ ధర రూ.300పైనే ఉంది. మటన్ ధర రూ.800 వరకు పలుకుతోంది.
ఆకాశాన్నంటుతున్న ధరలు
నెలలోనే ఎంతో వ్యత్యాసం
కూరగాయలు
న్యూస్టుడే, నెల్లూరు(జడ్పీ): ఏం కొనలేం.. ఏం తినలేం అన్నట్లుంది.. సామాన్యుడి పరిస్థితి. మాంసం చేపల ధరలు పెరిగి పోవడంతో శాఖాహారిగా మారుతున్నారు. చివరకు కూరగాయల ధరలు కూడా ఆకాశానంటుతున్నాయి. కిలో చికెన్ ధర రూ.300పైనే ఉంది. మటన్ ధర రూ.800 వరకు పలుకుతోంది. రెండింటి ధరలు పెరగడంతో మాంసాహారులు చేపల కొనుగోలుపై దృష్టి సారించారు. వాటి ధర కూడా కిలో రూ.150 పేనే పలుకుతోంది. ఇలా అన్ని ధరలు పెరగడంతో ఎక్కువ మంది కూరగాయల కొనుగోలు చేస్తున్నారు. ఈనెల మధ్య నుంచి వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి.
- గతనెలకు ఈనెలకు ఎంతో వ్యత్యాసం ఉంది. కొన్ని సగానికి సగం పెరిగిపోయాయి. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్కు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం దాదాపుగా రూ.కోటి వరకు వ్యాపారం జరుగుతుంది. ఇక్కడకు జిల్లా నలుమూలల నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. అలాంటి ప్రధాన మార్కెట్లోనే ధరలు పెరిగిపోతున్నాయి. మార్కెట్కు రాలేక సామాన్యులు తమ వీధుల్లో కూరగాయలు కొందామంటే రెండింతలు పెంచి అమ్ముతున్నారు.
ఎండల ప్రభావంతో..
ఎండల ప్రభావంతో ధరలు పెరిగిపోతున్నాయి. పంటలు సరిగా పండక దిగుబడులు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్కు రావడం లేదు. అందువల్ల కూరగాయల ధరలు టోకు వ్యాపారుల వద్దే పెరిగినట్లు చిల్లర వర్తకులు తెలుపుతున్నారు. ఎండాకాలం కూలీల రేట్లు, రవాణా ఖర్చు పెరగటం వంటి కారణాలతో ధరలు పుంజుకున్నాయని వ్యాపారులంటున్నారు.
కొత్తిమీర రూ.40
చివరకు కొత్తిమీర కట్ట ఒక్కొక్కటి రూ.40కి అమ్ముతున్నారు. బీన్స్ రూ.120 వరకు ధర పలుకుతోంది. కోలార్ నుంచి బీన్స్, క్యారెట్, కొత్తిమీర తదితర కూరగాయలు ఇక్కడకు వస్తుంటాయి. చివరకు కరివేపాకు కూడా రూ.5కు ఇవ్వడం లేదు. ఇటీవల వరకు కిలో రూ.10 వంతున అమ్మే టమటాలు సైతం రూ.35 పలుకుతున్నాయి. జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే పచ్చిమిర్చి కిలో రూ.70 వరకు పలుకుతోంది. పందిరి చిక్కుళ్లు సగభాగం అంగళ్లు అమ్మడం లేదు. ఒకరిద్దరు తెప్పిస్తున్నా, వాళ్లూ కిలో రూ.80కు పైనే అమ్ముతున్నారు.
ఇంతగా ఎప్పుడూ పెరగలేదు:
బుజ్జమ్మ
ఇటీవలకాలంలో ఇంతగా కూరగాయల ధరలు పెరగడం ఎప్పుడూ జరగలేదు. మార్కెట్కు రావాలంటే భయమేస్తోంది. మిర్చి నుంచి అన్నీ ధరలు పెరిగిపోయాయి.
వీధుల్లో ఇంకా ఎక్కువ
వెంకటేశ్వర్లు
మార్కెట్లో కొనుగోలు చేసి ఎక్కువ ధరలతో ఇష్టానుసారంగా స్థానిక వీధుల్లో అమ్ముతున్నారు. ఇలాగైతే సామాన్యులు బతకడం కష్టమే. కిలోకు బదులు పావు కిలో కొంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీజనల్ వ్యాధులపై అవగాహన
[ 27-07-2024]
కొవ్వూరు : మండలంలోని పొడుగుపాడు సచివాలయం-1 పరిధిలోని ఈరోజు గుంటూరు జోనల్ అదనపు డైరెక్టర్ జి. వీర్రాజు ఆధ్వర్యంలో బృందము దోమల లార్వాలను పరిశీలించారు. -
మాజీ ఎమ్మెల్యేను సన్మానించిన కోటంరెడ్డి బద్రర్స్
[ 27-07-2024]
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కావలి మాజీ ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారు. -
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు