రూ. 5 కోట్ల స్థలం కబ్జా
కంచే చేను మేసిందన్న చందంగా.. జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానం అధీనంలోని ఇరిగేషన్ భూమిపై కొందరు కబ్జాదారుల కన్నుపడింది. కొంత కాలం కిందటే దాన్ని కాజేయాలన్న యత్నాలు ప్రారంభించి.. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ..
జొన్నవాడ దేవస్థానం అధీనంలోని భూమికి ఎసరు
కంచే చేను మేసిందన్న చందంగా.. జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానం అధీనంలోని ఇరిగేషన్ భూమిపై కొందరు కబ్జాదారుల కన్నుపడింది. కొంత కాలం కిందటే దాన్ని కాజేయాలన్న యత్నాలు ప్రారంభించి.. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ.. దానికి కార్యరూపం ఇచ్చారు. స్థలాన్ని చదును చేసి.. గ్రావెల్ తోలారు. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్టుడే : జొన్నవాడ దేవస్థానానికి ఎదుట.. ఏపీ టూరిజంకు దక్షిణాన, పెన్నానదికి ఉత్తరం వైపు సర్వే నంబరు 129లో కొంత.. 91సీలో మరికొంత.. మొత్తంగా నీటిపారుదలశాఖకు చెందిన ఎకరా స్థలాన్ని దిగమింగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ స్థలాన్ని చదును చేసి.. గ్రావెల్ తోలారు. దేవస్థానంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తే.. ఈ కబ్జాకు పాల్పడినట్లు గ్రామస్థులు, భక్తులు ఆరోపిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో పార్కింగ్, సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణకు ఈ స్థలం ఎంతో అనువుగా ఉండేది. ఇంతకు ముందు దేవస్థానానికి సంబంధించిన పూలతోపుగా ఉండేది. ఇంతటి కీలకమైన.. అదీ దేవస్థానానికి చెందిన స్థలాన్ని ఆక్రమించడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో.. దేవస్థానం కోసం అనేలా చదను, గ్రావెల్ తోలి.. ఆ ముసుగులో ఆక్రమణకు పాల్పడ్డారన్న విమర్శలు నెలకొన్నాయి. గ్రామస్థులు దీనిపై ఆర్డీవో మాలోలకు ఫిర్యాదుచేశారు. తగు చర్యలు తీసుకుని స్థలాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.
ఆర్డీవో, పోలీసులకు ఫిర్యాదు చేస్తా
వి.గిరికృష్ణ, ఈవో
కబ్జాపై ఆర్డీవో, పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కబ్జాదారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. గ్రామస్థులు, భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు