ఉలవపాడు మామిడి.. విదేశాలకు ఎగుమతి
ఉలవపాడు మామిడికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇక్కడ పండే బంగినపల్లి రకానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఇంతటి పేరున్నా.. గత కొన్నేళ్లుగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెగుళ్లకు తోడు.. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దిగుబడులు సగానికిపైగా తగ్గిపోయాయి.
బంగినపల్లికి మంచి గిరాకీ
కందుకూరు పట్టణం, న్యూస్టుడే: ఉలవపాడు మామిడికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇక్కడ పండే బంగినపల్లి రకానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఇంతటి పేరున్నా.. గత కొన్నేళ్లుగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెగుళ్లకు తోడు.. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దిగుబడులు సగానికిపైగా తగ్గిపోయాయి. పోనీ.. వచ్చిన పంటైనా సకాలంలో.. సక్రమంగా అమ్ముకునేందుకు అవకాశం ఉందా? అంటే.. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు ఇబ్బంది పడుతున్న దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యానశాఖ ద్వారా రైతులు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకునే అవకాశం కల్పించగా.. కొందరు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. తాము ఆదాయం పొందడంతో పాటు మరో పది మందికి ఉపాధి చూపుతూ ఇతరులకూ మార్గదర్శకంగా నిలుస్తున్నారు.
కాయలను ట్రేల్లో సర్దుతూ..
నాణ్యతను ధ్రువీకరించి..
కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో సుమారు పదివేల ఎకరాలు, గుడ్లూరులో 3వేలు, కందుకూరు, వలేటివారిపాలెం మండలాల్లో వేయి ఎకరాల్లో మామిడి సాగవుతుందని అంచనా. ఇక్కడ బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, నీలం, కొబ్బరి మామిడి, పునారస్, హిమామ్ పసంద్ తదితర రకాలు సాగవుతాయి. వచ్చిన దిగుబడులను ప్రతి వేసవిలో 16వ నంబరు జాతీయ రహదారి వెంబడి దుకాణాలు ఏర్పాటు చేసి.. విక్రయిస్తుంటారు. ఉలవపాడులో జరిగే బహిరంగ మార్కెట్లోనూ అమ్మకాలు చేస్తుండగా- ఇక్కడి నుంచి ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, గుంటూరు, దిల్లీ, హరియాణ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ క్రమంలో రైతుల కష్టం దళారులపాలవుతోందని గుర్తించిన కేంద్రం.. ఉద్యానశాఖ ద్వారా నేరుగా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. దీనికి ముందుగా పొలం పాసుపుస్తకం, ఆధార్ కార్డుతో అధికారులను సంప్రదిస్తే.. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్టు డెవలప్మెంట్ అథారిటీ(అపెడా)లో రైతు వివరాలు నమోదు చేస్తారు. విదేశాలకు ఎగుమతి చేయాలంటే.. ముందుగా నాణ్యమైన కాయలను ఎంచుకుని.. వాటిని బెంగళూరు సమీపంలోని మాలూరు ఇన్నోవా ఫుడ్ పార్కుకు పంపాలి. అక్కడ ‘గామా’ కిరణాలతో(ఇర్రేడియేషన్) పరీక్షలు జరిపి, నాణ్యమైనవిగా ధ్రువీకరించిన తర్వాత విదేశీ ఏజెంట్ల ద్వారా అమెరికా, కెనడా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ఈ ఏడాది ఉలవపాడు, గుడ్లూరు మండలాలకు చెందిన సుమారు 350 మంది రైతులు అంపెడాలో వివరాలు నమోదు చేయించుకున్నారు.
ఇక్కడి కాయలకు.
బ్రహ్మసాయి, ఉద్యానశాఖ అధికారి, కందుకూరు
మామిడిలో పూత, పిందె దశలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం చాలా అవసరం. కాయ నిమ్మ పరిమాణంలో ఉన్నప్పుడు ఫ్రూట్ కవర్లు తొడగడం ఎంతో మేలు చేస్తుంది. తెగుళ్లు, పండుఈగ, మంచు తదితరాల నుంచి రక్షణ లభిస్తుంది. కాయ కోసే నాలుగు రోజుల ముందు కవర్లు తొలగిస్తే.. రుచి బాగుంటుంది. నాణ్యమైన కాయలకు మంచి గిరాకీ ఉంది. అవి ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
భీమవరం నుంచి అమెరికాకు
ఉలవపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన డి.శ్రీనివాసరాజు ఇటీవల సుమారు 12 టన్నుల కాయలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు మాలూరులోని ఇన్నోవా ఫుడ్పార్కుకు విక్రయించారు. డిగ్రీ పూర్తి చేసిన ఈయనది.. వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి తండ్రి, తాతలను చూసి సాగుపై మక్కువ పెంచుకున్నారు. వ్యవసాయ పనులు చేస్తూనే డిగ్రీ పూర్తి చేశారు. నాలుగు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం లాభసాటిగా లేదని.. డిగ్రీ పూర్తయిన అనంతరం విజయవాడలో కంప్యూటర్స్ హార్డ్వేర్ విభాగంలో ఉద్యోగిగా చేరారు. 20 ఏళ్లపాటు అదే ఉద్యోగిగా కొనసాగారు. ఆ క్రమంలో ప్రతి వేసవిలో వచ్చే మామిడి కాయలను స్వగ్రామం నుంచి తీసుకువెళ్లి.. అక్కడ తనకు తెలిసిన వారికి ఇచ్చేవారు. రెండేళ్ల కిందట ఉలవపాడు మామిడిని ఎలాగైనా.. ఇతర దేశాలకు పంపాలని లక్ష్యంగా పెట్టుకుని.. ఉద్యోగం వదిలేసి.. స్వగ్రామానికి వచ్చారు. అంపెడాలోని ఆర్చెడ్లో వివరాలు నమోదు చేసుకున్నారు. నాణ్యమైన కాయలను సేకరించి.. గత ఏడాది ఎనిమిది, ఈ ఏడాది 12 టన్నులు మాలూరు హౌస్కు పంపారు. అక్కడి నుంచి ఏజెంట్ల ద్వారా అమెరికాకు ఎగుమతి అయ్యాయి. రాబోయే రోజుల్లో విదేశాలకు తానే నేరుగా ఎగుమతి చేసేందుకు కృషి చేస్తానని ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుతం కొంత ఆదాయం పొందడంతో పాటు మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్