చెత్త స్టేషన్!
కావలి రైల్వేస్టేషన్ సహా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్ధితులు అధ్వానంగా ఉన్నాయి. రైల్వే, పురపాలక అధికారుల నడుమ సమన్వయం కొరవడడంతో ఈ దుస్థితి.
రైల్వే అధికారుల అలసత్వం
పట్టించుకోని కావలి పురపాలకం
ఈ చిత్రంలో కనిపించేది కావలి రైల్వేస్టేషన్ ప్లాట్ఫాంల వద్ద పేరుకుపోతున్న చెత్తాచెదారాలు. రాత్రివేళల్లో స్టేషన్కు వచ్చే ప్రయాణికులు దోమలబెడదతో ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేస్టేషన్ పారిశుద్ధ్య విభాగం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది.
కావలి, న్యూస్టుడే: కావలి రైల్వేస్టేషన్ సహా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్ధితులు అధ్వానంగా ఉన్నాయి. రైల్వే, పురపాలక అధికారుల నడుమ సమన్వయం కొరవడడంతో ఈ దుస్థితి. ప్రధానంగా ఉత్తర, దక్షిణ జనతాపేటవాసులు ఈ రైల్వే పట్టాలకు ఆనుకొని ఉండేవారంతా ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణ పరిధిలో రైల్వే పట్టాలకు ఆనుకుని నివసించే ఇతర ప్రాంతాల ప్రజానీకం సైతం సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ప్రయాణికుల వినియోగించిన వస్తువుల వ్యర్థాలు వేసేందుకు అవుట్లెట్ లేదు. స్టేషన్కు సమీపంలో ఉన్న పరిసరాల్లోనే అంతా కుప్పగా పారబోస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్కు వచ్చేవారికి సమస్యలు ఎదురవుతున్నాయి. రాత్రివేళల్లో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంది. జనతాపేట నుంచి పట్టాలు దాటుకొని వచ్చే వారు సమస్య ఎదుర్కొంటున్నారు. స్టేషన్ తూర్పు వైపు ముఖద్వారం వద్ద అధ్వానంగా ఉంది.
పట్టాలకు ఇరువైపులా..
జనతాపేట ప్రాంతం వద్ద రైల్వేశాఖ నిర్లక్ష్యంతో పట్టాలకు ఇరువైపులా చెత్త వేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్న చెత్తాచెదారాలను ఇక్కడ గుట్టగుట్టలుగా పోస్తున్నారు. దీంతో సంకలవారితోట, కళుగోళమ్మపేట, పూలబజార్, వడ్డిపాళెం, క్రిస్టియన్పేట, కోఆపరేటివ్కాలనీ, శాంతినగర్ ప్రాంతాల ప్రజలు దుర్గంధంతో అవస్థలు పడుతున్నారు.
ఎవరూ పట్టించుకోవడం లేదు
కావలి జనతాపేట దక్షిణ ప్రాంతంలో పాత నవాబు భవన సముదాయం వెనుక నుంచి పురపాలక డ్రైన్ రైల్వేగోడకు ఆనుకుని వెళ్తోంది. రెండు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కాలువ బాగోగులు ఎవరూ పట్టించుకోవడం లేదు. రైల్వే క్వార్టర్స్లో ఉండే ఉద్యోగుల కుటుంబాలకు సైతం చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పాత భవనాలు అలాగే ఉంచడటంతో సమస్యలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వడ్డిపాళెం వద్ద పాతభవనాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.
చిత్రంలో కనిపించేది కావలి పట్టణంలోని రైల్వేస్టేషన్కు ఆనుకొని వెళ్లే మురుగుకాలువ. ఈ కాలువలో చెత్తాచెదారమంతా అడ్డగోలుగా పేరుకుపోతున్నాయి. దీంతో మురుగు ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇక వర్షాలొచ్చినప్పుడైతే అదనపు వరద జలాలు ముందుకెళ్లేందుకు వీల్లేక పొంగిపొర్లుతోంది.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
మా స్టేషన్ నుంచి చెత్తాచెదారాలు స్థానికంగా వేయడం లేదు. రైల్వేట్రాక్ వెంబడి వేస్తున్న చెత్తచెదారాలపై పరిశీలిస్తాం. అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
అశోక్, సూపరింటెండెంట్, కావలి రైల్వేస్టేషన్
బాగు చేయిస్తాం
పురపాలక పరిధిలో ఉండే చెత్తాచెదారాలకు బాధ్యత వహిస్తాం. మేజర్ డ్రైన్లో పూడిక తీయిస్తాం. రైల్వేస్టేషన్ పారిశుద్ధ్య విభాగం కూడా అవసరమైన కార్యాచరణ చేపట్టాలి. ప్రజలకు సమస్యల్లేకుండా చేస్తాం.
జి.శ్రావణ్కుమార్, కమిషనర్, కావలి పురపాలకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి