అందరికీ అందేదెన్నడో!
పాఠశాలల పునఃప్రారంభం సమీపిస్తోంది. కానీ విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో చేరలేదు.
అరకొర పాఠ్యపుస్తకాలు..
జలదంకి విద్యావనరుల కేంద్రానికి చేరిన పాఠ్యపుస్తకాలు
దుత్తలూరు, న్యూస్టుడే: పాఠశాలల పునఃప్రారంభం సమీపిస్తోంది. కానీ విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో చేరలేదు. ఏటా బడులు తెరిచే నాటికి విద్యార్థులకు అవసరమైన సామగ్రిని సమకూర్చుతామని అధికారులు చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పాఠశాలలు తెరిచిన రెండు నెలల వరకు పుస్తకాలు అందుబాటులోకి రావడం లేదు. ఈ ఏడాది అదే తీరు కనిపిస్తోంది.
ఏటా ఇదే పరిస్థితి..
ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 453 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటికి ఆయా తరగతులకు సంబంధించి మొత్తం 2,26,841 పుస్తకాలు కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కేవలం 66,386 మాత్రమే వచ్చాయి. ఇంకా 1,60,455 పుస్తకాలు రావాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆ శాఖ అధికారులు అందజేసిన ఇండెంట్ ప్రకారం పాఠ్యపుస్తకాలను ఆయా మండల కేంద్రాలకు చేర్చాలి. కానీ ఏటా సక్రమంగా సకాలంలో అందటంలేదు. దీంతో పాఠశాలలు ప్రారంభమైన నెల వరకు విద్యార్థులను పుస్తకాల అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 8-10 తరగతుల విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు మాత్రమే మండల కేంద్రాలకు చేరాయి. మిగిలిన ఒకటి నుంచి ఏడో తరగతి పాఠ్యపుస్తకాలు ఇప్పటివరకు రాలేదు. వరికుంటపాడు, కొండాపురం మండలాలకు మాత్రం ఇప్పటి వరకు ఒక్క పుస్తకం కూడా రాకపోవడం గమనార్హం.
విద్యార్థుల్లో ఆందోళన
పాఠశాలలు ప్రారంభం నాటికి అన్నీ పుస్తకాలు వస్తాయనే నమ్మకం లేదు. ఇదిలా ఉండగా విద్యావనరుల కేంద్రాలకు వచ్చిన వాటిని బడులకు పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా పూర్తిస్థాయిలో వచ్చిన తరువాత పంపిణీ చేద్దామన్న ఆలోచనలో స్థానిక అధికారులు ఉన్నారు. దీంతో పూర్తిస్థాయిలో అందుతాయో లేదోనని ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
సకాలంలో అందజేస్తాం
జిల్లాకు వచ్చిన పాఠ్య పుస్తకాలను ఆయా మండల కేంద్రాలకు చేరవేస్తున్నాం. మొదటి విడతగా వచ్చిన పుస్తకాలను ఇప్పటికే విద్యా వనరుల కేంద్రాలకు పంపించాం. మిగిలిన వాటిని త్వరలోనే ఆయా మండలాలకు చేరవేస్తాం. పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుస్తకాలతోపాటు విద్యా కానుక కిట్లను కూడా అందజేస్తాం.
రఘురామయ్య, కావలి ఉప విద్యాశాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!