ముందుచూపు లేకుంటే.. ముంపే!
వర్షాకాలం వస్తోందంటే నగరవాసుల్లో ఆందోళన మొదలవుతోంది. నెల్లూరు నగరంతో పాటు లోతట్టు కాలనీ వాసుల్లో ముంపు భయం వెంటాడుతోంది.
కాలువల్లో పూడిక తీస్తేనే మేలు
న్యూస్టుడే, నెల్లూరు (నగరపాలకసంస్థ)
నీట మునిగిన మాగుంట లేఅవుట్ (పాత చిత్రం)
వర్షాకాలం వస్తోందంటే నగరవాసుల్లో ఆందోళన మొదలవుతోంది. నెల్లూరు నగరంతో పాటు లోతట్టు కాలనీ వాసుల్లో ముంపు భయం వెంటాడుతోంది. ఏటా జలమయమవుతున్న ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఒక్కోసారి నాలుగైదు రోజుల పాటు కాలనీలు నీటిలోనే ఉంటున్నాయి. ఏటా సమస్య ఎదురవుతున్నా.. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు లేవు. మురుగు కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేస్తే కొంత వరకు ముంపు ముప్పు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి.
వర్షం పడితే సమస్యే
నెల్లూరు నగరంలో వర్షం కురిస్తే కుంచించుకుపోయిన మురుగునీటి కాలువలు వర్షపునీటి ప్రవాహాన్ని అడ్డుకోనున్నాయి. 2015 నవంబరులో జిల్లా కేంద్రంలో భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరింది. 2021, 2022, 2023లో కురిసిన వర్షాలకు నగరంలోని ప్రధాన ప్రాంతాలు నీట మునిగాయి. శివారు కాలనీల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. నగరంలో కురిసిన వర్షం మురుగునీటి కాలువల ద్వారా బయట ప్రాంతాలకు సులువుగా చేరుకోవాలంటే.. ముందస్తుగా ఆయా నాళాలను శుభ్రం చేయాలి. వర్షపునీరు రోడ్లపై పారకుండా నాళాల ద్వారా బయటకు వెళ్లేలా ఉండాలి. దీంతో ముప్పును ముందస్తుగా తప్పించేందుకు అవకాశం ఉంటుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి కాలువల్లో పూడిక తీయించాల్సిన ఆవశ్యకత ఉంది.
మన్సూర్నగర్లో కాలువ దుస్థితి
పనులు చేపడతాం
సమస్యపై ఎస్ఈ సంపత్కుమార్ మాట్లాడుతూ వర్షపునీటి పారుదలకు ఆటంకం లేకుండా కాలువల్లో పూడికతీత పనులు చేపడతామని తెలిపారు. అలాగే నగరవ్యాప్తంగా కాలువల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు.
ఈ కాలనీల్లోనే..
నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారితో పాటు వహాబ్పేట, లీలామహల్ రోడ్డు, భగత్సింగ్కాలనీ, జనార్దన్రెడ్డికాలనీ, వైఎస్సార్నగర్, పోలీసు కాలనీ, రెవెన్యూ కాలనీ, చంద్రబాబునగర్, పరమేశ్వరినగర్, డ్రైవర్స్కాలనీ, మన్సూర్నగర్, జయలలితనగర్, పొర్లుకట్ట తదితర ప్రాంతాలు ఏటా ముంపునకు గురవుతున్నాయి. వీటితో పాటు నగరంలోని మాగుంట లేఅవుట్, రామలింగాపురం, ఆత్మకూరు బస్టాండు వంతెనల కింద భారీగా నీరు చేరి.. నగరంలోకి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు స్పందించి కాలువల్లో పూడిక తీయించి ముంపు సమస్య తలెత్తకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీజనల్ వ్యాధులపై అవగాహన
[ 27-07-2024]
కొవ్వూరు : మండలంలోని పొడుగుపాడు సచివాలయం-1 పరిధిలోని ఈరోజు గుంటూరు జోనల్ అదనపు డైరెక్టర్ జి. వీర్రాజు ఆధ్వర్యంలో బృందము దోమల లార్వాలను పరిశీలించారు. -
మాజీ ఎమ్మెల్యేను సన్మానించిన కోటంరెడ్డి బద్రర్స్
[ 27-07-2024]
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కావలి మాజీ ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారు. -
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్