పాలతిప్ప గుల్ల
మండలంలోని మినగల్లు.. చరితగల నేల. ఇక్కడి చెట్టు చేమలు.. కొండలు, గుట్టలు చారిత్రక చిహ్నాలు. ఏం ప్రయోజనం.. ప్రస్తుతం ఈ ప్రాంతం గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డాగా మారింది.
వందల టిప్పర్లతో అక్రమ రవాణా
పొక్లెయిన్తో గ్రావెల్ తవ్వకం
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్టుడే: మండలంలోని మినగల్లు.. చరితగల నేల. ఇక్కడి చెట్టు చేమలు.. కొండలు, గుట్టలు చారిత్రక చిహ్నాలు. ఏం ప్రయోజనం.. ప్రస్తుతం ఈ ప్రాంతం గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డాగా మారింది. ఇప్పటికే ఇక్కడి తిప్పలను తవ్వి.. రూ. కోట్లు సంపాదించిన అక్రమార్కుల కన్ను.. చారిత్రక ఆనవాళ్లున్న మినగల్లులోని పాలతిప్పపై పడింది. రాత్రింబవళ్లు ఇక్కడి గ్రావెల్ను అడ్డంగా బొక్కేస్తున్నారు. సొమ్ములు.. సొంత ప్రయోజనాలే ముఖ్యం.. గ్రామం ఏమైనా మాకు అనవసరం అనేలా మాఫియా నడుస్తోంది. పాలతిప్పను తవ్వి.. రోజూ వందల టిప్పర్లలో తరలిస్తున్నారు. రాత్రిపూట టిప్పర్ల జోరుతో గ్రామస్థులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని ఓ వైకాపా నాయకుడి కనుసన్నల్లో ఈ అనధికార అక్రమాలు యథేచ్ఛగా సాగుతుండగా- మైనింగ్, రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులు కన్నెత్తి చూడటం లేదు. అక్రమార్కుల చర్యలతో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులు లేవు ప్రమీల, తహసీల్దారు
మినగల్లులోని పాలతిప్ప తవ్వి.. గ్రావెల్ తరలించాలని ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. అక్రమంగా తరలిస్తే కఠినచర్యలు తప్పవు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్