logo

వైకాపా నేతను పరామర్శించిన స్వతంత్ర అభ్యర్థి

పట్టణంలోని 33 వ వార్డుకు చెందిన వైకాపా నాయకుడు బొగ్గవరపు వెంకటేశ్వర్లు (బీవీ)  మంగళవారం రాత్రి పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై..

Published : 03 Apr 2024 11:44 IST

కావలి: పట్టణంలోని 33 వ వార్డుకు చెందిన వైకాపా నాయకుడు బొగ్గవరపు వెంకటేశ్వర్లు (బీవీ)  మంగళవారం రాత్రి పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో  అన్నపూర్ణా క్లాత్ మార్కెట్ సమీపంలోకి రాగానే ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం  అదుపుతప్పి కింద పడింది. గమనించిన స్థానికులు ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రికి  తరలించారు. విషయం తెలుసుకున్న  స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఆసుపత్రికి వెళ్లి బీవీని పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని