అడ్డగోలు పోస్టులు పెడితే ఇబ్బందే
చేతిలో చరవాణి ఉందని ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రత్యర్థులపై పోస్టులు పెట్టడం.. సామాజిక వర్గాలను కించపరచడం...
సామాజిక మాధ్యమాల పరిశీలనకు కమిటీ
చేతిలో చరవాణి ఉందని ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రత్యర్థులపై పోస్టులు పెట్టడం.. సామాజిక వర్గాలను కించపరచడం... రెచ్చగొట్టే వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన వ్యక్తులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టటానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు వాటి పరిశీలనకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
న్యూస్టుడే, దుత్తలూరు
ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సామాజిక మాధ్యమాల తీరుతెన్నులపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం చరవాణి, సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రధాన పక్షాల అభ్యర్థులు వాటిని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. దీంతో వాట్సాప్, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ఫాలోవర్లు ఎక్కువ ఉన్న వారిని ఆయా పార్టీల నేతలు లోబరుచుకుంటున్నారు. ప్రత్యర్థులపై పోస్టులు పెట్టి వారిని మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిని క్షణాల్లో వైరల్ చేసి లబ్ధి పొందుతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యర్థులను విమర్శించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు తదితర విషయాలు వివాదాస్పదంగా మారుతుంటాయి. దీనికితోడు ఎన్నికల కోడ్ రాకముందే సామాజిక మాధ్యమాల్లో పార్టీలు పోటీపడి దుష్ప్రచారాలు చేసుకుంటూ ఉంటాయి. ఈక్రమంలో జిల్లాలో మీడియా మానిటరింగ్ కమిటీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టే వారిపై చర్యలు చేపట్టనుంది.
క్రిమినల్ కేసులు నమోదు...
విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అనుచితమైన మార్ఫింగ్ చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఐపీసీ 153ఏతోపాటు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ చట్టం కింద నేర నిరూపణ అయితే మూడేళ్ల జైలు లేదా జరిమానా తీవ్రతను అనుసరించి రెండూ విధించే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దని, అనుచిత పోస్టులు పెట్టేవారిని గ్రూపుల నుంచి తొలగించాలని అడ్మిన్లకు పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల హడావుడి పెరిగిన నేపథ్యంలో రాజకీయ పార్టీలే లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టు చేసే అవకాశం ఉంది. కరపత్రాలు తదితర వాటిని గ్రూపుల్లో ఉంచితే అవి వైరల్గా మారే అవకాశం ఉంది.
అప్రమత్తత ముఖ్యం
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు, పాస్పోర్టులకు దరఖాస్తు చేసుకునేవారు, విద్యార్థులు, యువత ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల వ్యవహారంలో సంయమనం పాటించాలని స్పష్టం చేస్తున్నారు. సాధారణ సమయం, ఎన్నికల సందర్భంగా నమోదయ్యే కేసులకు తేడా ఉంటుందని పేర్కొంటున్నారు. కఠిన సెక్షన్లు పొందుపరిచి కేసులు నమోదు చేస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో నేటి యువత అత్యంత జాగరూకతతో వ్యవహరించకుంటే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందంటున్నారు.
నిరంతరం గమనిస్తూ..
జిల్లాస్థాయి మీడియా మానిటరింగ్ కమిటీలో కలెక్టర్, సంయుక్త కలెక్టర్, పోలీసు అధికారులు, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా ప్రతినిధి, సీనియర్ సిటిజన్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులు. వీరు నిరంతరం ఆయా మాధ్యమాలను గమనించడంతోపాటు అందిన ఫిర్యాదులను పరిశీలిస్తారు. రోజూవారీ దినపత్రికలు కూడా పరిశీలిస్తారు. అభ్యంతకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీడియోలు విడుదల చేసినా బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు అధికారులు తీసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచారం
[ 03-05-2024]
క్లస్టర్ ఇన్ఛార్జ్, తెదేపా సీనియర్ నాయకుడు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో 19వ వార్డు ఇన్ఛార్జ్ వేగూరి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సీనియర్ ఫ్యాకల్టీకి ఎస్వీ వర్సిటీ డాక్టరేట్
[ 03-05-2024]
కావలి పట్టణానికి చెందిన సురేఖ కుమారికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. -
పరిశ్రమలు రావాలంటే బాబు రావాలి
[ 03-05-2024]
కోవూరు మండల వలసలతో వైకాపా బక్కచిక్కుతుంటే తెదేపా బలపడుతోంది. -
నగరంలో నేడు చంద్రబాబు, పవన్కల్యాణ్ పర్యటన
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. -
జగన్.. ఏడి‘పింఛన్’!
[ 03-05-2024]
అవ్వా తాతల జీవితాల్లో ఆనందం, సంతోషం చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. అందుకే వారి ఇంటి వద్దనే పింఛను డబ్బు పంపిణీ చేసే విధానాన్ని ప్రారంభిస్తున్నామని పదే పదే చెప్పిన జగన్.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వారిని ఇబ్బంది పెట్టేందుకూ వెనుకాడటం లేదు. -
జిల్లా ఓటర్లు 19,44,874
[ 03-05-2024]
జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. నియోజకవర్గాల వారీగా ఓటుహక్కు వినియోగించుకునే వారి తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలో గత జననవరి 22వ తేదీ నాటికి 19,08,498 ఉండగా- తాజా జాబితా ప్రకారం ఆ సంఖ్య పెరిగింది. -
వంతెన నిర్లక్ష్యం.. ఈ వంతున
[ 03-05-2024]
జిల్లాలో పలు రహదారులు, శిథిలమైన వంతెనలు భయపెడుతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో కాలం చెల్లిపోయాయి. వీటిపై రాకపోకలు ప్రమాదకరంగా సాగిస్తున్నారు. -
ఉక్కపోత.. ఇక్కట్ల కలబోత
[ 03-05-2024]
ఎండలు ఠారెస్తున్నాయి.. బయటకు రావాలంటే హడలెత్తుతున్నారు.. సామాన్య ప్రజలే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
[ 03-05-2024]
ఇటీవల జాకీర్హుస్సేన్ నగర్లో జరిగిన హత్య కేసులో నిందితులను నవాబుపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నవాబుపేట ఇన్స్పెక్టర్ ఎం.బాబి వివరాలు వెల్లడించారు. -
రూ.1.20 కోట్ల మద్యం స్వాధీనం
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మద్యం దుకాణాలు, బార్లను తనిఖీ చేస్తున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.నాగమల్లేశ్వరరెడ్డి పేర్కొన్నారు. -
బకింగ్హామ్ కాలువపై శ్రద్ధేది ఏలికా..?
[ 03-05-2024]
కరేడు పంచాయతీ పరిధిలోని సముద్ర తీరంలో ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు హెచరీల నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే ఎనిమిది హెచరీల నిర్మాణాలు పూర్తయ్యాయి. -
జనంమెచ్చని స్మార్ట్ టౌన్షిప్
[ 03-05-2024]
మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తామంటూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎంఐజీ లేఅవుట్కు ప్రజల నుంచి స్పందన కరవైంది. -
పండుటాకులతో రాజకీయం
[ 03-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. యువకులే బయటకు వచ్చే పరిస్థితులు లేవు. గడప దాటితే కుప్పకూలే పరిస్థితి. ఈసమయంలో పింఛనుదారులకు ప్రభుత్వం నరకం చూపించింది. ఇంటికొచ్చి నగదు ఇచ్చే వీలున్నా బ్యాంకుల్లో జమ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం
-
ప్రభాకర్రావు కోసం పోలీసుల వేట .. అరెస్టు వారెంట్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్
-
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల