అడ్డగోలు పోస్టులు పెడితే ఇబ్బందే
చేతిలో చరవాణి ఉందని ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రత్యర్థులపై పోస్టులు పెట్టడం.. సామాజిక వర్గాలను కించపరచడం...
సామాజిక మాధ్యమాల పరిశీలనకు కమిటీ
చేతిలో చరవాణి ఉందని ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రత్యర్థులపై పోస్టులు పెట్టడం.. సామాజిక వర్గాలను కించపరచడం... రెచ్చగొట్టే వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన వ్యక్తులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టటానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు వాటి పరిశీలనకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
న్యూస్టుడే, దుత్తలూరు
ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సామాజిక మాధ్యమాల తీరుతెన్నులపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం చరవాణి, సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రధాన పక్షాల అభ్యర్థులు వాటిని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. దీంతో వాట్సాప్, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ఫాలోవర్లు ఎక్కువ ఉన్న వారిని ఆయా పార్టీల నేతలు లోబరుచుకుంటున్నారు. ప్రత్యర్థులపై పోస్టులు పెట్టి వారిని మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిని క్షణాల్లో వైరల్ చేసి లబ్ధి పొందుతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యర్థులను విమర్శించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు తదితర విషయాలు వివాదాస్పదంగా మారుతుంటాయి. దీనికితోడు ఎన్నికల కోడ్ రాకముందే సామాజిక మాధ్యమాల్లో పార్టీలు పోటీపడి దుష్ప్రచారాలు చేసుకుంటూ ఉంటాయి. ఈక్రమంలో జిల్లాలో మీడియా మానిటరింగ్ కమిటీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టే వారిపై చర్యలు చేపట్టనుంది.
క్రిమినల్ కేసులు నమోదు...
విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అనుచితమైన మార్ఫింగ్ చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఐపీసీ 153ఏతోపాటు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ చట్టం కింద నేర నిరూపణ అయితే మూడేళ్ల జైలు లేదా జరిమానా తీవ్రతను అనుసరించి రెండూ విధించే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దని, అనుచిత పోస్టులు పెట్టేవారిని గ్రూపుల నుంచి తొలగించాలని అడ్మిన్లకు పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల హడావుడి పెరిగిన నేపథ్యంలో రాజకీయ పార్టీలే లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టు చేసే అవకాశం ఉంది. కరపత్రాలు తదితర వాటిని గ్రూపుల్లో ఉంచితే అవి వైరల్గా మారే అవకాశం ఉంది.
అప్రమత్తత ముఖ్యం
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు, పాస్పోర్టులకు దరఖాస్తు చేసుకునేవారు, విద్యార్థులు, యువత ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల వ్యవహారంలో సంయమనం పాటించాలని స్పష్టం చేస్తున్నారు. సాధారణ సమయం, ఎన్నికల సందర్భంగా నమోదయ్యే కేసులకు తేడా ఉంటుందని పేర్కొంటున్నారు. కఠిన సెక్షన్లు పొందుపరిచి కేసులు నమోదు చేస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో నేటి యువత అత్యంత జాగరూకతతో వ్యవహరించకుంటే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందంటున్నారు.
నిరంతరం గమనిస్తూ..
జిల్లాస్థాయి మీడియా మానిటరింగ్ కమిటీలో కలెక్టర్, సంయుక్త కలెక్టర్, పోలీసు అధికారులు, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా ప్రతినిధి, సీనియర్ సిటిజన్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులు. వీరు నిరంతరం ఆయా మాధ్యమాలను గమనించడంతోపాటు అందిన ఫిర్యాదులను పరిశీలిస్తారు. రోజూవారీ దినపత్రికలు కూడా పరిశీలిస్తారు. అభ్యంతకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీడియోలు విడుదల చేసినా బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు అధికారులు తీసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీజనల్ వ్యాధులపై అవగాహన
[ 27-07-2024]
కొవ్వూరు : మండలంలోని పొడుగుపాడు సచివాలయం-1 పరిధిలోని ఈరోజు గుంటూరు జోనల్ అదనపు డైరెక్టర్ జి. వీర్రాజు ఆధ్వర్యంలో బృందము దోమల లార్వాలను పరిశీలించారు. -
మాజీ ఎమ్మెల్యేను సన్మానించిన కోటంరెడ్డి బద్రర్స్
[ 27-07-2024]
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కావలి మాజీ ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారు. -
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు