బడ్జెట్పై తెవివి ఆశలు
‘‘త్వరలో ప్రకటించే రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై తెలంగాణ విశ్వవిద్యాలయం ఎంతో ఆశతో ఉంది. 2023-24లో రూ.140 కోట్లకు పైగా కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వానికి రూ. 140 కోట్ల ప్రతిపాదనలు
న్యూస్టుడే, తెవివి క్యాంపస్: ‘‘త్వరలో ప్రకటించే రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై తెలంగాణ విశ్వవిద్యాలయం ఎంతో ఆశతో ఉంది. 2023-24లో రూ.140 కోట్లకు పైగా కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఇందులో బ్లాక్గ్రాంట్ కింద రూ.73.47 కోట్లు, డెవలప్మెంట్ కోసం రూ.67.06 కోట్లు పొందుపర్చినట్లు తెలిసింది. మరి సర్కారు కేటాయింపులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.’’
అంతంత మాత్రమే..!
ఏటా బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకు కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. 2014 ఏడాది నుంచి డెవలప్మెంట్ గ్రాంట్ను కేటాయించడం లేదు. ఫలితంగా యూనివర్సిటీలో నూతన భవనాల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన మరుగున పడినట్లైందని వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు వాపోతున్నారు.
ఇదొక్కటే దిక్కు
గత కొన్నేళ్లుగా యూనివర్సిటీలకు వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్గ్రాంట్ను మాత్రమే కేటాయిస్తోంది. వీటిని నెలవారీగా విడుదల చేస్తోంది. ప్రతినెల తెవివిలోని రెగ్యులర్, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, సిబ్బంది వేతనాలకు రూ.2 కోట్లకు పైగా చెల్లింపులు అవుతున్నాయి.
నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నాం
డెవలప్మెంట్ గ్రాంట్స్ కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం బడ్జెట్లో వేతనాల కోసం మాత్రమే బ్లాక్గ్రాంట్ కేటాయిస్తోంది. తెవివిలో భవనాల నిర్మాణం కోసం సైన్స్, టెక్నాలజీ, ఐసీఎస్ఎస్ఆర్, యూజీసీతో పాటు విదేశీ సంస్థల నుంచి నిధులు రాబట్టేలా సొంతంగా ప్రయత్నాలు చేస్తున్నా.
ఆచార్య రవీందర్, తెవివి ఉపకులపతి
భవనాల కొరత
రాష్ట్రంలో మూడో అతిపెద్ద యూనివర్శిటీగా తెవివికి పేరున్నప్పటికీ ఆ స్థాయిలో వసతుల కల్పనకు నోచుకోకపోవడం దురదృష్టకరం. ఇక్కడ భవనాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈసారైనా డెవలప్మెంట్ నిధులు వస్తే కొన్నింటికైనా మోక్షం లభిస్తుంది.
* సైన్స్ కళాశాలకు సొంతగూడు లేదు.
* వర్సిటీ ఆవిర్భవించి 17 ఏళ్లు అవుతున్నా పరీక్షల విభాగానికి ప్రత్యేక భవనం లేకపోవడం గమనార్హం.
* ఇపుడున్న మహిళా వసతి గృహంలో బాలికలు కిక్కిరిసి తలదాచుకుంటున్న దుస్థితి.
* ఆడిటోరియం లేక అంతర్జాతీయ సదస్సులకు ఇబ్బందిగా మారింది. గతేడాది ఓ కాన్ఫరెన్స్ను నిజామాబాద్లోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
* ఇండోర్, అవుట్ డోర్ క్రీడా మైదానాల కొరత ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగు మారిన మిషన్ భగీరథ నీరు
[ 27-07-2024]
మండలంలోని తాండూర్ గ్రామంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్భగీరథ నీరు కలుషితంగా వస్తోంది. -
ఎన్ఏ సర్వేపై ఉపాధ్యాయులకు శిక్షణ
[ 27-07-2024]
జాతీయ సాధన సర్వే (నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే) 2024 లో భాగంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..