భువన్ సర్వేలో వెనుకంజ
నగర, పురపాలికల్లో ఇళ్ల నిర్మాణాల గుర్తింపులో యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టి భువన్ యాప్లో మ్యాపింగ్ చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
దృష్టి సారించని అధికార యంత్రాంగం
న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం
యాప్లో నిర్మాణాల గుర్తింపు
నగర, పురపాలికల్లో ఇళ్ల నిర్మాణాల గుర్తింపులో యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టి భువన్ యాప్లో మ్యాపింగ్ చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో పాత నగర, పురపాలికల్లో 94,311 ఇళ్లను ఉపగ్రహ పటాలను అనుసరించి గుర్తించారు. వాటిని ఆన్లైన్లో నమోదు చేశారు. కొత్త పురపాలికలు బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్గల్లో చర్యలు కరవయ్యాయి.
సర్వే ఏమిటంటే..?
ఏటా భువన్ సర్వే పేరిట పురాల్లో నిర్మాణాలను పరిశీలించి కొలతలు తీసుకోవాలి. వాటిని ఆన్లైన్లో పొందుపర్చాలి. గతంలో ఉన్న కొలతలు సవరించి వాటి స్థానంలో కొత్తగా తీసుకున్న వాటిని నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తికాకుంటే పురపాలికలు ఆదాయపరంగా నష్టపోతాయి. ఆస్తి పన్ను రూపంలో రావాల్సిన సొమ్ము రాదు. దృష్టి సారించాల్సిన యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఈ సమస్య అధిగమించాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించాలి. కొలతల ప్రక్రియ వేగవంతం చేయాలి. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చిత్రాలను పొందుపర్చాలి.
కొత్త నిర్మాణాలపై దృష్టి సారించాలి
ఉమ్మడి జిల్లాలో పురాల్లో అనేక కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. శివారు కాలనీల్లో భారీ భవంతులు ఏర్పాటవుతున్నాయి. అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. వాణిజ్య సముదాయాలు అద్దెకు ఇస్తున్నారు. ఆస్తి పన్ను పరిధిలోకి రాకున్నా యజమానులు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇలాంటి నిర్మాణాలపై యంత్రాంగం దృష్టి సారించాలి. కొలతలు సవరించి పన్ను విధించాలి. అప్పుడే పురాలు ఆర్థికంగా బలోపేతమవుతాయి.
సిబ్బంది కొరత..
నగర, పురపాలికల్లోని వార్డులు, డివిజన్ల సంఖ్యకు అవసరమైన బిల్కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది లేరు. ఉన్నవారిలో ఒక్కొక్కరు 3 నుంచి 6 వార్డులు/డివిజన్లను పర్యవేక్షించాల్సి వస్తోంది. ఏటా మార్చి నెలాఖరు వరకు బకాయిల వసూళ్లకు వెళుతున్నారు. ఆ తర్వాత 5 శాతం రాయితీతో ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. అనంతరం నూతన నిర్మాణాలకు పన్ను వేయడానికి దరఖాస్తులు వస్తేనే సిబ్బంది కాలుకదుపుతున్నారు. లేకుంటే 6 నెలల వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల