రాతి గుహ నుంచి తీర్థం
నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం. ఏ పుణ్యక్షేత్రంలో లేని విధంగా కొండ గుహలోంచి వచ్చే నీరును తీర్థం రూపంలో ఇక్కడి అర్చకులు అందిస్తారు. దేవుడి సృష్టిగా భక్తులు నమ్ముతారు.
నేటి నుంచి తొర్లికొండ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
న్యూస్టుడే, జక్రాన్పల్లి
స్వయంభూ శిలాతీర్థ వేంకటేశ్వర స్వామి
నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం. ఏ పుణ్యక్షేత్రంలో లేని విధంగా కొండ గుహలోంచి వచ్చే నీరును తీర్థం రూపంలో ఇక్కడి అర్చకులు అందిస్తారు. దేవుడి సృష్టిగా భక్తులు నమ్ముతారు. ఈ నీరు వేసవిలో అధికంగా, వర్షాకాలంలో తక్కువగా వస్తుంది. ఇదే జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలోని స్వయం భూ శిలాతీర్థ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత.
ఆలయ చరిత్ర
తొర్లికొండ గ్రామంలోని కొండలపై స్వామి వారు వెలిశారు. పూర్వం ఊరిపైకి పెండారుదండు అనే దొంగల ముఠా దోపిడీలకు వచ్చినప్పుడు ప్రజలు తమ వద్ద ఉన్న విలువైన వస్తువులు, సామగ్రిని గుట్టపై ఉన్న ఆలయ కోటలోకి తీసుకెళ్లి తలుపులు మూసి దుంగలను అడ్డుగా పెట్టేవారు. ఆలయం చుట్టూ ఉన్న ఎత్తైన గోడ రక్షణ కవచంగా ఉండేది. తలుపులు తెరిచే వీలులేకపోవడంతో దొంగల నుంచి గ్రామస్థులు సురక్షితంగా ఉండేవారు. ఇలా ఇక్కడ కొలువైన వేంకటేశ్వర స్వామి భక్తుల కోర్కేలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారు. గుహ నుంచి రోజు చిన్న బిందెడు పరిమాణంలో వచ్చిన నీటిని ఉదయం ఆరాధన సమయంలో సేకరిస్తారు. వైష్ణవులు ఆలయ అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి శనివారం ఇక్కడ పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో సౌకర్యాలను మెరుగుపరిచారు. ఆలయ, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కొండపై చదును చేసి నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఆలయ స్వాగత తోరణం
ప్రత్యేక కార్యక్రమాలు
ఏటా శ్రీరామనవమికి ముందు వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ, గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు తెలిపారు. 13న అంకురార్పణ, 14న ద్వారా తోరణం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు, 15న నిత్యహోమం, దొంగల దోపు కార్యక్రమాలు, 16న స్వామివారి కల్యాణం, 17న రథోత్సవం, 18న చక్రతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి