ఒక స్థానం.. నాలుగు జిల్లాల అధికారులు
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడనుంది.
జహీరాబాద్ లోక్సభ ఎన్నికలకు కసరత్తు
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్
ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్, ఎస్పీ సింధూశర్మ
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. ఈ లోక్సభ స్థానానికి కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల అధికారులు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
బాధ్యతలు ఇలా..
జహీరాబాద్ లోక్సభ స్థానం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. కామారెడ్డి జిల్లాలో ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో మూడు మండలాలు కామారెడ్డి జిల్లాలో, మరో మూడు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ నియోజకవర్గం మొత్తం ఎన్నికల బాధ్యతలను నిజామాబాద్ ఎన్నికల అధికారి నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి మాత్రం మూడు మండలాలకు సంబంధించిన ఎన్నికల సిబ్బందిని ఎంపిక చేయడం, వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ మూడు మండలాలకు సంబంధించిన ఈవీఎంలను ఎన్నికల సిబ్బందికి అందజేయనున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారే నిర్వహిస్తారు. ఇక సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గ ఎన్నికలను సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి నిర్వహిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక మండలం మెదక్ జిల్లాలో కొనసాగుతుంది. అయినప్పటికీ సంగారెడ్డి జిల్లా అధికారులే పర్యవేక్షణ చూసుకుంటున్నారు. ఇక అందోల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నాలుగు మండలాలు సంగారెడ్డి జిల్లాలో, మరో మూడు మండలాలు మెదక్ జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇక్కడ ఎవరి పరిధిలో వారే ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాల అధికారులే ఈవీఎంలు, ఎన్నికల సిబ్బందిని నియమిస్తున్నారు.
నామినేషన్ల స్వీకరణ సంగారెడ్డిలో..
పోలింగ్ ప్రక్రియ వరకు నాలుగు జిల్లాల అధికారులు బాధ్యతలు పంచుకుంటూ ఎన్నికల విధులు నిర్వహిస్తున్నప్పటికీ నామినేషన్లు, ఓట్ల లెక్కింపు మాత్రం సంగారెడ్డి జిల్లాలోనే జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. ఇక పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలు, వీవీ ప్యాట్లను సంగారెడ్డి జిల్లాకు తరలించనున్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూంలలో భద్రపరుస్తారు. అనంతరం జూన్ 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగు మారిన మిషన్ భగీరథ నీరు
[ 27-07-2024]
మండలంలోని తాండూర్ గ్రామంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్భగీరథ నీరు కలుషితంగా వస్తోంది. -
ఎన్ఏ సర్వేపై ఉపాధ్యాయులకు శిక్షణ
[ 27-07-2024]
జాతీయ సాధన సర్వే (నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే) 2024 లో భాగంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత