మద్యం మత్తు.. యువత చిత్తు
‘భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలోని ఓ కల్లు దుకాణం ఆవరణలో గతంలో కొందరు యువకులు మద్యం మత్తులో పాఠశాల విద్యార్థినులను వేధించారు. సదరు విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
న్యూస్టుడే, భిక్కనూరు
‘భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలోని ఓ కల్లు దుకాణం ఆవరణలో గతంలో కొందరు యువకులు మద్యం మత్తులో పాఠశాల విద్యార్థినులను వేధించారు. సదరు విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. కానీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.’
‘భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలోని ఓ కల్లు దుకాణం ఆవరణలో ఉన్న ఈత వనం జూదరులకు అడ్డాగా మారింది. మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు నిత్యం అక్కడికి చేరుకుని మద్యం సేవిస్తూ చిత్తుబొత్తు ఆడుతున్నారు. శుక్రవారం తిప్పాపూర్ గ్రామానికి చెందిన మహిళ అక్కడికి వచ్చి వారితో తీవ్ర వాగ్వాదం చేసింది. తన భర్త ఇంట్లో నుంచి వేల రూపాయలు తీసుకువచ్చి చిత్తుబొత్తులో పోగొట్టుకుంటున్నాడని అక్కడ ఉన్న వారితో గొడవపడింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని తిట్లదండకం ఎత్తుకుంది. వారం రోజుల క్రితం ఇలాగే డబ్బుల విషయంలో యువకులు గొడవపడితే గ్రామస్థులు వారిని హెచ్చరించి మరోసారి అక్కడికి రావొద్దన్నారు. అయినా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే మకాం వేస్తున్నారు.
జూదం, బెట్టింగ్, మద్యం మత్తులో గ్రామీణ యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కల్లు దుకాణాలు, నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాలుగా ఏర్పరుచుకుని గుట్టుగా జూదం(చిత్తుబొత్తు) దందా నడిపిస్తున్నారు. రూ.వందలతో ప్రారంభమై వేలు, లక్షల్లో ఇది కొనసాగుతుంది. మద్యం మత్తులో వ్యసనాలకు బానిసై అప్పులు చేసి కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారు. భిక్కనూరు మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న దందాపై ప్రత్యేక కథనం.
ఆర్థికంగా కుదేలు
జూదానికి బానిసైన వారికి కొందరు డబ్బుల ఆశ చూపి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. రూ.వెయ్యి అప్పు ఇస్తే గంటకు వంద రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారు. డబ్బుల కోసం సెల్ఫోన్లు, ద్విచక్రవాహనాలు, బంగారం తనఖా పెట్టిన సందర్భాలు అనేకం. ఇంట్లో విషయం తెలిస్తే పరువు పోతుందని ఎవరికీ చెప్పుకోలేక కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బహిరంగంగా నడుస్తున్న దందాపై పోలీసులు మిన్నకుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బెట్టింగుల్లో పాల్గొని..
ఉదయం పూట జూదం, సాయంత్రం వేళ ఐపీఎల్ బెట్టింగుల్లో పాల్గొంటున్నారు. తిప్పాపూర్కు చెందిన వ్యక్తి, రామేశ్వరపల్లికి చెందిన మరో యువకుడు కీలకంగా వ్యవహరిస్తూ బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. డబ్బుల కోసం ఆశపడి బెట్టింగ్లో పాల్గొన్న ఓ యువకుడిని ఘటనా స్థలంలో చితకబాదిన సందర్భం ఉంది.
భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
సంపత్, సీఐ, భిక్కనూరు
యువత కేసుల్లో ఇరుక్కొని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. నిషేధిత బెట్టింగ్, జూదంలో పాల్గొని మత్తు పదార్థాలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా బెట్టింగ్, జూదం నిర్వహిస్తే సమాచారం ఇవ్వాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. కొన్ని ప్రదేశాలలో భిక్కనూరు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అవసరమైతే కౌన్సిలింగ్ ఇస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?