వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్ల జైలు
జిల్లాలో ఇటీవల అటవీ జంతువుల వేట విచ్చలవిడిగా సాగుతోంది. వేటగాళ్లపై దృష్టి సారించామని, వారిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నామని జిల్లా అటవీ శాఖ అధికారిణి బోగ నిఖిత పేర్కొన్నారు. న్యూస్టుడే ఆమెతో ముఖాముఖి నిర్వహించగా పలు విషయాలను వెల్లడించారు.
డీఎఫ్వో బోగ నిఖితతో ‘న్యూస్టుడే’ ముఖాముఖి
న్యూస్టుడే, కామారెడ్డి నేరవిభాగం
జిల్లాలో ఇటీవల అటవీ జంతువుల వేట విచ్చలవిడిగా సాగుతోంది. వేటగాళ్లపై దృష్టి సారించామని, వారిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నామని జిల్లా అటవీ శాఖ అధికారిణి బోగ నిఖిత పేర్కొన్నారు. న్యూస్టుడే ఆమెతో ముఖాముఖి నిర్వహించగా పలు విషయాలను వెల్లడించారు.
న్యూస్టుడే: జిల్లాలో అటవీ జంతువుల వేట కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఎఫ్ఓ: అటవీ జంతువులను వేటాడితే వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. అడవుల్లో వేటగాళ్ల ఆనవాళ్లు కనిపిస్తే పర్యవేక్షిస్తూ పట్టుకుంటున్నాం. జిల్లాలో రెండు నెలల వ్యవధిలో 42 ప్రాంతాల్లో దాడులు చేసి ఉచ్చులు, వేట సామగ్రిని స్వాధీనం చేసుకొని పలువురిపై కేసులు నమోదు చేశాం.
వేసవికాలంలో వన్యప్రాణులకు నీటి వసతి ఎలా?
అడవిలోని ప్రతి 2 కిలోమీటర్ల దూరంలో నీటి వసతి ఏర్పాటు చేశాం. ఊట చెరువులు-చెక్డ్యాంలు, 361 సాసర్పిట్లు నిర్మించాం. వీటితో పాటు 4 సోలార్ బోర్బావులు కూడా ఏర్పాటు చేసి ఏడాది పొడవునా తాగునీటి సదుపాయం కల్పించాం. సాసర్పిట్లలో నిత్యం నీళ్లు నింపేలా చర్యలు చేపట్టాం.
ఎండాకాలంలో అటవీ సంపదకు ముప్పు వాటిల్లుతోంది. కార్చిచ్చుల నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు?
గుర్తుతెలియని వ్యక్తులు అడవులకు నిప్పు పెట్టినా పూర్తిగా తగలబడకుండా ‘ఫైర్ లైన్స్’ అనే విధానాన్ని అమలుచేస్తున్నాం. ప్రతి అయిదు మీటర్ల దూరంలో ఉన్న ఆకులు, వ్యర్థాలను ఒకచోటకు చేర్చి కాల్చివేస్తాం. దీంతో భవిష్యత్లో ఎవరైనా నిప్పు పెట్టినా అక్కడికే మంటలు వ్యాపించి ఆగిపోతాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 25 కిలోమీటర్ల మేర ఫైర్లైన్స్ పూర్తి చేయడం జరిగింది.
అడవుల పునరుద్ధరణకు సంరక్షణ చర్యలు ఏమిటి?
మొక్కల పెంపకాన్ని నిరంతరంగా చేపడుతున్నాం. ఫలాలు, వెదురు మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నాం. పశువుల మేత కోసం కాపరులు అడవుల్లోకి రాకుండా పశు వనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. కామారెడ్డి అటవీ డివిజన్ పరిధిలో 125 ఎకరాల విస్తీర్ణంలో పశు వనాలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం.
పోడు పట్టాలే కాకుండా అటవీ భూముల ఆక్రమణలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. దీనిపై మీ చర్యలేమిటి?
పోడు పట్టాలిచ్చిన భూముల్లో గిరిజనులు యంత్రాలను వాడరాదు. వారి జీవనోపాధికి ఈ భూముల్లో పండిన పంటల దిగుబడులను వినియోగించుకోవాలి. జిల్లాలోని 16 వేల మంది గిరిజనేతరులు 16,500 ఎకరాల్లో అటవీ భూములను ఆక్రమించి సేద్యం చేస్తున్నారు. వీరు సైతం పోడు పట్టాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. ఆయా అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికి కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై కేసులు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఆరు నెలల్లోనే అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడిన 11 మందిని బైండోవర్ చేయడంతో పాటు 64 కేసులు నమోదు చేయడం జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్