ఉపాధి డబ్బులకు నిరీక్షణ
రెక్కాడితే గాని డొక్కాడని ఉపాధి కూలీలు విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారికి పది వారాల నుంచి కూలీ సొమ్ము రావడం లేదు. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
10 వారాలుగా ఖాతాల్లో జమకాని వైనం
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు
రెక్కాడితే గాని డొక్కాడని ఉపాధి కూలీలు విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారికి పది వారాల నుంచి కూలీ సొమ్ము రావడం లేదు. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే వ్యవసాయ పనుల సీజన్ ముగిసింది. కూలీలు ఎక్కువ సంఖ్యలో ఉపాధి బాట పట్టారు. కానీ, సకాలంలో డబ్బులు చేతికందక కుటుంబం గడవడం కోసం ఇతరుల వద్ద చేయి చాచాల్సి వస్తోంది. గతంలో క్రమం తప్పకుండా డబ్బు జమయ్యేది. కానీ, ఒక్కసారిగా ఇబ్బందులు తలెత్తడంతో ఏమీ తోచని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారు.
ఆర్థిక ఇబ్బందులు : జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది కూలీలు ప్రస్తుతం ఉపాధి పనులకు వెళ్తున్నారు. కొన్ని మండలాల్లో మాత్రం ఫిబ్రవరి నెల డబ్బులు ఖాతాల్లో జమయ్యాయి. కానీ చాలా మందికి ఫిబ్రవరి నుంచి పైకం అందడం లేదు. అధికారుల సూచన మేరకు కూలీలు జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. డబ్బులు సకాలంలో అందకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి న్యాయం చేయాలని వాపోతున్నారు.
కొత్త సాఫ్ట్వేర్తో..
ఉపాధి హామీ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి నుంచి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్) అనే కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సాఫ్ట్వేర్ వాడేవారు. ఈ కొత్త విధానంతో డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమవ్వాలి. కానీ, కొత్త సాఫ్ట్వేర్ ద్వారా కూలీల డబ్బులు వారి ఖాతాల్లో జమైంది లేనిదీ బ్యాంకుకు వెళ్తే గానీ తెలుసుకోలేని పరిస్థితి. గతంలోని సాఫ్ట్వేర్ ద్వారా బ్యాంకుకు వెళ్లకున్నా డబ్బులు వచ్చింది రానిదీ తెలిసిపోయేది.
ఉపాధి కూలీలకు డబ్బులు రాకపోవడంపై ‘న్యూస్టుడే’ డీఆర్డీవో చందర్నాయక్ను వివరణ కోరగా.. డబ్బుల జాప్యానికి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు.
‘ఈ చిత్రంలో కనిపిస్తున్న ఉపాధి కూలీ పేరు నారాయణ. స్వగ్రామం రాజంపేట మండలం పొందుర్తి. ఈయన నిత్యం ఉపాధి పనులకు వెళ్తుంటారు. కానీ, కొన్ని నెలలుగా డబ్బులు రావడం లేదు. అధికారులు, బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేదు. సొమ్ము సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగు మారిన మిషన్ భగీరథ నీరు
[ 27-07-2024]
మండలంలోని తాండూర్ గ్రామంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్భగీరథ నీరు కలుషితంగా వస్తోంది. -
ఎన్ఏ సర్వేపై ఉపాధ్యాయులకు శిక్షణ
[ 27-07-2024]
జాతీయ సాధన సర్వే (నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే) 2024 లో భాగంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..