ఛైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ
కామారెడ్డి బల్దియా రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నెల 15న ఛైర్పర్సన్ ఎన్నికకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గురువారం కొంత మంది, శుక్రవారం మరికొందరు శిబిరానికి తరలి వెళ్లారు.
శిబిరానికి తరలిన కౌన్సిలర్లు
కామారెడ్డి పట్టణం-న్యూస్టుడే
కామారెడ్డి పురపాలక సంఘ కార్యాలయం
కామారెడ్డి బల్దియా రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నెల 15న ఛైర్పర్సన్ ఎన్నికకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గురువారం కొంత మంది, శుక్రవారం మరికొందరు శిబిరానికి తరలి వెళ్లారు. గత నెల అవిశ్వాస నోటీసు ఇచ్చాక కాంగ్రెస్ కౌన్సిలర్లు గోవాకు వెళ్లారు. ఆ తర్వాత ఎనిమిది మంది భారాసకు చెందిన సభ్యులు కూడా జతగూడారు. వేర్వేరుగా శిబిరాలు నిర్వహించామని నాయకులు పేర్కొన్నారు. గత నెల 30న పురపాలికలో అవిశ్వాసం నెగ్గింది. 10 మంది భారాస సభ్యులు 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిసి ఛైర్పర్సన్ నిట్టు జాహ్నవిని గద్దె దించారు. ఈ ప్రక్రియకు 34 మంది అవసరం కాగా ముగ్గురు అదనంగా ఓటేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 4వ తేదీన అవిశ్వాసంపై గెజిట్ విడుదలైంది. 15న ఎన్నిక నిర్వహించేందుకు తేదీ ఖరారైంది. తాజాగా ఎన్నికకు రెండు రోజుల ముందు హైదరాబాద్లో శిబిరానికి వెళ్లారు.
తెరపైకి భాజపా
భాజపా నుంచి ఛైర్పర్సన్ బరిలో పోటీకి సిద్ధమని ఇప్పటికే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రకటించారు. ‘నిజాయతీ కలిగిన వ్యక్తిని ఎన్నుకుంటే సరి.. ఈ విషయంలో కౌన్సిలర్లంతా ఆలోచించాలి. లేదంటే భాజపా తరఫున ఛైర్పర్సన్కు పోటీ చేస్తాం’ అన్నారు. ఇప్పటికే భాజపాతో పలువురు ఇతర పార్టీల కౌన్సిలర్లు మంతనాలు జరుపుతున్నారు. మొత్తంమీద తొలిసారి కామారెడ్డి అవిశ్వాస ప్రక్రియ నెగ్గడం, ఆ తర్వాత నూతన ఛైర్పర్సన్ ఎన్నికకు సన్నాహాలు చేయడం బల్దియా చరిత్రలో సరికొత్త ఒరవడికి నాంది పలికినట్లయింది.
అధికారం దక్కేదెవరికో..?
ఛైర్పర్సన్గా అధికారం ఎవరికి దక్కేనో అని ఉత్కంఠ నెలకొంది. వైస్ఛైర్మన్తో పాటు మరో కౌన్సిలర్ ఈ పదవికి పోటీపడుతున్నారు. వీరిద్దరు కాదంటే మరో కౌన్సిలర్కు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే శిబిరాల నిర్వహణకు రూ.లక్షల్లో ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష స్థానం ఎవరిని వరించేనో అని చర్చనీయాంశమైంది. ఇప్పటికే అధికారం కోల్పోయిన భారాస సర్కారు కామారెడ్డిలో కూడా ఛైర్పర్సన్ పదవిని పోగొట్టుకుంది. ఈ ఎన్నికలో భారాస పాత్ర నామమాత్రమేనని తెలుస్తోంది. పాలకవర్గంలో బలాబలాలు క్రమంగా తగ్గాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ