నమ్మితే.. నెట్టింటా ముంచుతారు
ఇలా ప్రజలు అంతర్జాలంలో దేని కోసం వెతుకుతున్నారో సైబరాసురులు గుర్తించి దొంగ వెబ్సైట్లుతో వారిని చేరుకుంటారు. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలకే ఇస్తామని ఆశచూపి అనుమానం రాకుండా మాటలు కలిపి నమ్మిస్తారు.
న్యూస్టుడే, ఇందూర్ సిటీ
బోధన్ మండలం ఆచన్పల్లికి చెందిన ఓ వ్యాపారి ఫేస్బుక్ ఖాతాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ఓ ప్రకటన చూశారు. రిటైల్ ఫ్రాంచైజీ కోసంే లింక్మీద నొక్కారు. తర్వాత వాట్సప్ కాల్ వచ్చింది. వివరాలతో కూడిన ధ్రువపత్రాలు కావాలని కోరడంతో వాటిని చేరవేశారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.25,500, తర్వాత రూ.48,500 చెల్లించాలని చెప్పడంతో పంపించారు. ఇలా మూడు విడతల్లో రూ 6.09 లక్షలు చేరవేశారు. తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గుర్తించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
భీమ్గల్కు చెందిన ఒకరు ఫిబ్రవరి 6న బైండింగ్ తీగల కోసం ఆన్లైన్లో వెతికారు. తర్వాతి రోజు గుర్తుతెలియని వ్యక్తి వాట్సప్లో బైండింగ్ తీగలు, మేకులకు సంబంధించిన చిత్రాలు పంపించాడు. అదేనెల 9న మరోసారి అవే చిత్రాలు పంపించాడు. 12న చిరునామా అడిగి వస్తువుల నాణ్యత గురించి మాట్లాడి కొంటానని నిర్ణయించుకున్నాడు. మోసగాడు బ్యాంకు ఖాతా వివరాలు పంపించగా మార్చి 27న రూ.లక్ష బదిలీ చేశాడు. తర్వాత మరో రూ.50 వేలు, రవాణాకు రూ.35 వేలు పంపాలని కోరగా మోసపోతున్నానని గుర్తించి 1930 నంబరులో ఫిర్యాదు చేశారు.
ఇలా ప్రజలు అంతర్జాలంలో దేని కోసం వెతుకుతున్నారో సైబరాసురులు గుర్తించి దొంగ వెబ్సైట్లుతో వారిని చేరుకుంటారు. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలకే ఇస్తామని ఆశచూపి అనుమానం రాకుండా మాటలు కలిపి నమ్మిస్తారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలని, రవాణా ఖర్చులని నగదు లాగుతున్నారు. రోజులు గడిచినా వస్తువు రాకపోవడం, పదే పదే డబ్బులు అడగడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి మోసాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నా లాభం లేకుండా పోతోంది. జిల్లాలో 2022లో 192, 2023లో 294 సైబర్మోసం కేసులు నమోదయ్యాయి.
వీటిల్లో ఫిర్యాదుచేయాలి..
ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నంబరు లేదా www.cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. ఈ పని గంటలోపు చేస్తే పెద్దఎత్తున నష్టపోకుండా చర్యలు తీసుకునే తీసుకునే వీలుంటుంది. రూ.లక్షలోపు స్థానిక ఠాణాల్లో, రూ.లక్షపైన మోసం జరిగితే నిజామాబాద్ సీపీ కార్యాలయంలోని సైబర్క్రైం ఠాణాలో ఫిర్యాదు చేయాలి. 08462-227433, సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటేశ్వర్రావు 8712665554, సీఐ ముఖీద్ పాషా 87126 65587లను సంప్రదించాలి.
జాగ్రత్తలు పాటిస్తే మేలు..
- అంతర్జాలంలో వచ్చే ప్రకటనలను పట్టించుకోకూడదు.
- ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోవాలి. కంపెనీ చిరునామా అడిగి అక్కడ ఉందో లేదో ఆరా తీయాలి.
- తెలియని వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో లింకులు పంపిస్తే తెరవొద్దు.
- స్టాక్ మార్కెట్్ పేరిట గ్రూపుల్లో అనుమతి లేకుండా చేర్చుతారు. వెంటనే అందులోంచి బయటకు వచ్చి రిపోర్టు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట