ఆత్మహత్యల కట్టడికి చర్యలేవీ?
ఇటీవల నవీపేట మండలం నాగేపూర్కు చెందిన ఇంటర్ విద్యార్థి (18) చదువు అర్థం కావడం లేదని యంచ వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంతెన పరిసరాల్లో లేక్ పోలీస్ అవుట్ పోస్టు ఉంటే సదరు విద్యార్థి ప్రాణాలు దక్కేవనే చర్చ జరుగుతోంది.
యంచ గోదావరి వద్ద మృత్యుఘోష
న్యూస్టుడే, నవీపేట
ఇటీవల నవీపేట మండలం నాగేపూర్కు చెందిన ఇంటర్ విద్యార్థి (18) చదువు అర్థం కావడం లేదని యంచ వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంతెన పరిసరాల్లో లేక్ పోలీస్ అవుట్ పోస్టు ఉంటే సదరు విద్యార్థి ప్రాణాలు దక్కేవనే చర్చ జరుగుతోంది.
నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో పవిత్ర గోదావరి ప్రవహిస్తోంది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివస్తుంటారు.మరోవైపు వివిధ కారణాలతో నదిలో దూకి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆత్మహత్యలతో బాధిత కుటుంబీకులకు తీరని శోకం మిగులుతోంది. నవీపేట మండలం యంచ వంతెన వైపు మూడేళ్లలో 25 మంది, నిర్మల్ జిల్లా బాసర వైపు ఆరు నెలల్లో 44 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారధి మీదుగా నీటిలో దూకిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. నది పరిసర ప్రాంతాలు ఆత్మహత్యలకు కేంద్రంగా మారడంపై సమీప గ్రామాల వారు ఆందోళన చెందుతున్నారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తిని అడ్డుకున్న యంచ యువకులు (పాతచిత్రం)
కాపాడుతున్న మత్స్యకారులు, యువకులు..
నదిలో నిత్యం మత్స్యకారులు చేపల వేట కోసం వస్తారు. నీళ్లలో దూకిన వారిని సమీపంలో ఉండే మత్స్యకారులు, అటుగా వెళ్లే యంచ యువకులు పదుల సంఖ్యలో తరచూ రక్షిస్తున్నారు. గతంలో ఓ యువతి, ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి వేర్వేరుగా నదిలో దూకగా.. యంచ మత్స్యకారులు యువతి, పిల్లల ప్రాణాలు కాపాడారు. నిజామాబాద్ పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు ప్రాణాలు కాపాడిన యువకులను అభినందించారు.
లేక్ పోలీస్ అవుట్పోస్టు అవసరం
యంచ - బాసర వంతెన వద్ద లేక్ పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో బాధితుల ప్రాణాలు తక్షణమే రక్షించే వీలు ఉంటుంది. సీసీ కెమెరాలు, వారధికి ఇరువైపులా వీధి దీపాలతో పాటు ఎత్తులో ఇనుప కంచెలు బిగిస్తే ఆత్మహత్యలను కొంతైనా నివారించవచ్చు.
నివారణ చర్యలు చేపట్టాలి
- ప్రవీణ్కుమార్, యంచ, గ్రామస్థుడు
నిజామాబాద్, నిర్మల్ జిల్లాల పాలనాధికారులు, పోలీసు అధికారులు తక్షణమే స్పందించి ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలి. ఈ మేరకు ఉన్నతాధికారులు, మంత్రులు, నియోజకవర్గ ప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం