నవజాత శిశువులకు.. ప్రాణరక్ష
ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అనే పరికరం గుండె లయకు సంబంధించింది. శిశువు గుండె చప్పుడు ఆగిన సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ యంత్రానికి రెండు ఫ్యాడ్లను అనుసంధానించి శిశువు ఛాతిపై పెడతారు. గుండె సరైన రీతిలో పనిచేసేలా చూస్తారు.
అంబులెన్స్లో ప్రత్యేక సేవలు
గుండె పనితీరు పరిశీలించేందుకు...
ఇన్ఫ్యూజన్ పంపు
న్యూస్టుడే, నిజామాబాద్ వైద్యవిభాగం
ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అనే పరికరం గుండె లయకు సంబంధించింది. శిశువు గుండె చప్పుడు ఆగిన సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ యంత్రానికి రెండు ఫ్యాడ్లను అనుసంధానించి శిశువు ఛాతిపై పెడతారు. గుండె సరైన రీతిలో పనిచేసేలా చూస్తారు.
అప్పుడే పుట్టిన శిశువుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన పరికరాలు, సౌకర్యాలు, మందులు ఉండవు. జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్దామంటే ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శిశువుల సంరక్షణ కోసం అనేక సదుపాయాలు, నూతన పరికరాలతో అంబులెన్స్ను అందుబాటులోకి తెచ్చింది. 83418 00828 నంబర్కు ఫోన్ చేస్తే వాహనం సేవలు పొందొచ్చు.
మల్టీ ఛానల్ మానిటరింగ్
శిశువు పల్స్రేట్, బీపీ వంటివి మల్టీఛానల్ మానిటరింగ్ అనే పరికరంలో చూస్తారు. అంబులెన్స్లో శిశువును ఉంచినప్పటి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు పల్స్రేట్ను వైద్య సిబ్బంది చూస్తుంటారు. దీని బట్టి అవసరమైన చికిత్స అందిస్తారు. దీంతో పాటు శిశువుకు సమయానుకూలంగా తగిన మోతాదులో ఇంజెక్షన్ అందించేందుకు ఇన్ఫ్యూజన్ పంపు అనే పరికరం ఉంటుంది.
వెచ్చని వాతావరణం కల్పించేలా..
అప్పుడే పుట్టిన శిశువుల్లో పచ్చకామెర్లు, ఇతర ఆనారోగ్య సమస్యలు తలెత్తితే తల్లి గర్భంలో ఉన్నట్లు వెచ్చని వాతావరణం కల్పిస్తారు. ఇందుకోసం రేడియంట్ వార్మర్ అనే పరికరాన్ని అందుబాటులో ఉంచారు. శిశువుకు అవసరమైన ఉష్ణోగ్రత కూడా అది అందిస్తుంది. వీటితో పాటు అంబులెన్స్లో కృత్రిమ వెంటిలేటర్ ఉంచారు. నంజు బయటకు తీసేలా ప్రత్యేక పరికరాలు ఉన్నాయి.
సద్వినియోగం చేసుకోవాలి
- బానేశ్, టెక్నీషియన్
అప్పుడే పుట్టిన శిశువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్లో ఎన్నో పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం