logo

అన్నివర్గాల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం

అభివృద్ధితోపాటు అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేర్కొన్నారు.

Published : 13 Apr 2024 17:54 IST

ఎల్లారెడ్డి పట్టణం: అభివృద్ధితోపాటు అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేర్కొన్నారు. శనివారం పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల, గ్రామ స్థాయి నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నివర్గాల సంక్షేమానికి బాటలు పడతాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న భారాస పాలనలో అవినీతి జరిగిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు ఉషగౌడ్, మండల, పట్టణ అధ్యక్షులు సాయిబాబా, వినోద్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని