logo

అకాల వర్షాలకి తడిసిన ధాన్యం

ఎల్లారెడ్డి పురపాలక పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి గండిమాసానిపెట్, లింగరెడ్డిపేట్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.

Published : 13 Apr 2024 19:58 IST

ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి పురపాలక పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి గండిమాసానిపెట్, లింగరెడ్డిపేట్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. విక్రయాల కోసం ఉంచిన ధాన్యం వాన నీటికి కొట్టుకుపోయింది. కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పి తడవకుండా రక్షించుకున్నారు. కోతకు వచ్చిన వరి పలుచోట్ల నేలకు ఒరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని