సాంకేతికతతో సమస్యలు అధిగమిద్దాం..!
పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది.
వినియోగంపై అవగాహన అవసరం
న్యూస్టుడే, ఇందూరు ఫీచర్స్
పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది. మరో ఘటనలో ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి ఓ యువతి చేసిన నిర్వాకం ఎలా వినియోగించుకోకూడదో తెలిపింది.
ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాకు చెందిన నిఖిత అనే బాలిక ఇంట్లో ఎవరూ లేనప్పుడు తన 15 నెలల వయసున్న మేనకోడలుతో ఆడుకుంటుంది. అప్పుడు కోతుల మంద వారింట్లోకి ప్రవేశించాయి. ఒక వానరం వారి వద్దకు వచ్చింది. దీంతో నిఖితకు తమ ఇంట్లో ఉన్న వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ పరికరం ‘అలెక్సా’ గుర్తుకొచ్చింది. వెంటనే కుక్కలా మొరగాలని అలెక్సాను ఆదేశించిందా బాలిక.తర్వాత అలెక్సా చేసిన శునక శబ్దాలకు వానరాలు పారిపోవడంతో ఇద్దరికి అపాయం తప్పింది.
మరో ఘటనలో రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడి స్నేహితుల వద్ద అప్పు చేసింది. ఒత్తిడి రావడంతో ఇంట్లో రూ.25 వేలు అపహరించి వస్తువులను చిందరవందరగా పడేసి దొంగలు పడ్డారని నమ్మించే ప్రయత్నం చేసింది. టెక్నాలజీ సాయంతో విచారించిన పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో తానే తప్పు చేసినట్లు అంగీకరించింది.
భిన్నమైనవే అయినా..
రెండు ఘటనలు భిన్నమైనవే అయినా... సాంకేతికత విషయంలో మన పిల్లల పరిస్థితి ఏమిటన్నది తల్లిదండ్రులు ప్రశ్నించుకోవడానికి దోహదం చేయనున్నాయి. సమస్యలు అధిగమించడానికి సాంకేతికతను ఉపయోగించాలని, ఇబ్బందుల బారిన పడేందుకు వినియోగించొద్దని పిల్లలకు అవగాహన కల్పించాలి. మరోవైపు జిల్లాలోనూ వానరాలు, శునకాల స్వైర విహారం చేస్తున్న గ్రామాలు చాలానే ఉన్నాయి. వాటి దాడిలో పిల్లలు గాయపడిన ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తున్నాయి. ఎటైనా వెళ్తున్నప్పుడు అవి ఎదురైతే భయపడకుండా ఎలా వ్యవహరించాలో నేర్పించాలి.
జిల్లాలో జరిగిన ఘటనలు..
టెక్నాలజీని ఎలా వినియోగించాలో తెలియక కొందరు చిన్నారులు సమస్యల బారిన పడ్డారు. వారిలో జిల్లాకు చెందిన ఓ బాలుడు ఇటీవలే ఆన్లైన్లో గేమ్ ఆడుతూ అప్డేట్ అంటూ వచ్చిన ఆప్షన్లు ఎంపిక చేసుకుంటూ, ఓటీపీ చెబుతూ ఖాతా నుంచి రూ.70వేలకు పైగా పోగొట్టిన ఘటన వెలుగు చూసింది. ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని తెలియకపోవడంతోనే ఈ సమస్య తలెత్తింది.
గతంలో సైతం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తి చేతిలో మోసపోయింది. సదరు వ్యక్తి విద్యార్థినిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆమెకు సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి అనే దానిపై అవగాహన లేకపోవడమే మోసపోవడానికి కారణమైంది.
ప్రయోజనాలు ఇలా..
మరి అదే టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రయోజనం పొందుతున్న విద్యార్థులు ఉన్నారు. ఇలాంటి వారిలో జిల్లా కేంద్రానికి చెందిన హారిక ఒకరు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా తాను మెడిసిన్ చదవాలనే కోరికను నెరవేర్చుకోవడానికి స్మార్ట్ఫోన్ను ఆయుధంగా మలచుకుంది. అందులో ఆన్లైన్ తరగతులు విని మంచి ర్యాంకు రావడంతో సిద్దిపేట వైద్య కళాశాలలో సీటు లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల