నామపత్రాల దాఖలుకు వేళాయె
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
జహీరాబాద్ స్థానానికి సంగారెడ్డి కలెక్టరేట్లో ఏర్పా
ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంట్లున్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారిగా సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉండటంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సంగారెడ్డిలోనే ఉంటుంది. సహాయ రిటర్నింగ్ అధికారులుగా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో పద్మజారాణి, కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డితో మరో నలుగురు ఆర్డీవోలు వ్యవహరిస్తారు. నామినేషన్ల స్వీకరణ మొదలు.. ఫలితాల వెల్లడి వరకు వీరు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.
సీసీ కెమెరాలతో నిఘా
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25 తుది గడువు. కలెక్టరేట్ ప్రధాన గేటు నుంచే సీసీ కెమెరా నిఘా ప్రారంభమవుతుంది. నామినేషన్ దాఖలు చేసి తిరిగి వెళ్లేవరకు అభ్యర్థులు, వారి వెంట వచ్చిన అనుచరుల కదలికల్ని సీసీ కెమెరాలతో పరిశీలిస్తారు. ఇందుకోసం 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. డిపాజిట్ కింద జనరల్ అభ్యర్థులైతే రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.12,500 చెల్లించాలి.
సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్
అభ్యర్థులు సరైన పద్ధతిలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే తిరస్కరణకు గురవుతాయి. పోటీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టరేట్లో నామినేషన్ల హెల్ప్ డెస్క్ను సైతం ఏర్పాటు చేశారు. సందేహాలను హెల్ప్ డెస్క్ సిబ్బంది నివృత్తి చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం