బలం పెంచుకునేలా వ్యూహాలు
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
పార్టీ శ్రేణులతో అభ్యర్థుల అంతర్గత సమావేశాలు
ఈనాడు, కామారెడ్డి
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు తమ పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు జరుపుతూ ఆయా ప్రాంతాల్లో వారికి కలిసొచ్చే అంశాలను పరిశీలిస్తూ విజయం సాధించేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారు.
స్వల్ప వ్యత్యాసమే
త్రిభాష సంగమంగా పేరొందిన జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారాస అభ్యర్థి బీబీపాటిల్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావుపై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పరంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో భారాస కంటే కాంగ్రెస్ పార్టీకి 18,644 ఓట్లు అధికంగా వచ్చాయి. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారాసకు కాంగ్రెస్ కంటే 6,166 ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి.
బలోపేతానికి చేరికలపై దృష్టి
మూడు ప్రధాన పార్టీలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలాబలాలను అంచనా వేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా చేరికలపై దృష్టి కేంద్రీకరించాయి. ముఖ్యంగా భాజపా, కాంగ్రెస్లు ఇతర పార్టీల ద్వితీయ శ్రేణి నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారాస తమ నేతలు పార్టీ విడిచి వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల్లో చేరిన నేతలను తిరిగి రప్పించేందుకు హస్తం నేతలు చర్యలు చేపట్టారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు చెందిన నేతలు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకొనేందుకు రంగం సిద్ధమైంది.
క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు
భాజపా, భారాస, కాంగ్రెస్ అభ్యర్థులు మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ముఖ్యనేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. లోపాలు తెలుసుకుంటూ మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టాలనే దానిపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
మద్దతు కూడగడుతున్న కుటుంబసభ్యులు
కాంగ్రెస్, భాజపా అభ్యర్థుల కుటుంబసభ్యులు తమ పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, కార్యకర్తల వద్దకు వెళ్లి మద్దతు తెలపాలని కోరుతున్నారు. పార్టీలో చేరికకు ఇబ్బందులుంటే ప్రచారంలో పాల్గొనకుండా అంతర్గతంగా సహకరించాలని అడుగుతున్నారు. ఇందుకు హమీ తీసుకుంటున్నారు. భాజపా అభ్యర్థి బీబీపాటిల్ తరఫున ఆయన సోదరులతో పాటు ఇతరులు పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూ మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం ఓసారి చుట్టేసి వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ కూతురు సైతం పార్టీ అనుబంధ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ విజయం కోసం పనిచేసేలా సమాయత్తం చేస్తున్నారు. భారాస అభ్యర్థి గాలి అనిల్కుమార్ తరఫున ఆయన బంధువులు విస్తృతంగా పర్యటిస్తూ తమ సామాజికవర్గానికి చెందిన నేతలు, సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ గంపగుత్తగా ఓట్లు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారాసను వీడిన నేతల వద్దకు వెళ్లి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో సహకరించాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?