నిబంధనల మేరకే గుర్తింపునిస్తారా..?
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది.
నేటి నుంచి బీఈడీ కళాశాలల తనిఖీలు
న్యూస్టుడే, తెవివి క్యాంపస్
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది.
వర్సిటీ పరిధిలోని ఓ పట్టణంలో రెండు బీఈడీ కళాశాలలు ఒకే భవనంలో నడుస్తున్నాయి. తనిఖీ బృందం వచ్చినప్పుడు మాత్రం వేర్వేరుగా చూపిస్తారు.
పట్టణంలో ఉన్న బీఈడీ కళాశాల కన్వీనర్ కోటలో సీటు వచ్చిన విద్యార్థులకు అధిక ఫీజులు కట్టాలని చెప్పి వెనక్కి పంపి ఖాళీగా చూపుతుంది. తర్వాత మేనేజ్మెంట్ కోటాలో అధిక డబ్బులకు భర్తీ చేస్తుంది. అయినా అధికారులు పట్టించుకోరనే లేదనే విమర్శలు ఉన్నాయి.
నూతన(2024-25) విద్యా సంవత్సరానికి బీఈడీ కళాశాలల అనుబంధ గుర్తింపునకు తెలంగాణ విశ్వవిద్యాలయ అధికారులు గురువారం నుంచి తనిఖీలు చేపట్టనున్నారు. వర్సిటీ పరిధిలో ఉమ్మడిజిల్లాలో 15 కళాశాలలున్నాయి. సారంగాపూర్ ఎడ్యుకేషన్ ఒకటి ప్రభుత్వ కళాశాల. మిగిలిన 13 బీఈడీ, ఒకటి బీపీఈడీ ప్రైవేటువే. గతేడాది 9 మాత్రమే ఎడ్సెట్ కౌన్సెలింగ్లో చేరాయి. సౌకర్యాలు లేకపోవడంతో ఆరింటిని చేర్చలేదు. తర్వాత కొద్ది రోజులకు వీటికి అనుమతిచ్చారు. ఈసారి ఎన్నింటికి గుర్తింపునిస్తారో.. చూడాలి మరీ.
ఇవి పాటించాలి...
ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం బీఈడీ కళాశాలకు సొంత భవనం ఉండాలి. 100 మంది విద్యార్థులకు 16 మంది అధ్యాపకులు అవసరం. ప్రిన్సిపల్ పీహెచ్డీ పట్టా పొంది ఉండాలి. కళాశాల భవనం, ల్యాబ్, మౌలిక వసతులు ఇలా పలు అంశాలు పరిశీలిస్తారు. ఈ ఏడాది అఫిలియేషన్ పొందిన 8 కళాశాలల్లో కొన్నింటిలో పూర్తిస్థాయి వసతులు లేవని ఓ ప్రిన్సిపల్ చెప్పడం గమనార్హం. 16 మంది అధ్యాపకులు ఉండాల్సిన చోట 10 మంది కూడా ఉండటం లేదు. అర్హత కలిగిన ప్రిన్సిపల్ పేరును, అధ్యాపకుల జాబితా చూపి అనుమతులు పొందుతున్నట్లు గతంలో తనిఖీ బృందం పరిశీలనలో బహిర్గతమైంది. బృందాలు వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ప్రిన్సిపల్, అధ్యాపకులను రప్పించి చూపిస్తున్నారు. తర్వాత వీరు కళాశాలలో మచ్చుకు కూడా కనిపించరు. తనిఖీ బృందం వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉండటంతో రాత్రికి రాత్రే అన్నీ సిద్ధం చేస్తారు. ఇలాంటి వ్యవస్థలో భావితరానికి దిశానిర్దేశం చేసే ఛాత్రోపాధ్యాయులు ఎలా తయారవుతారని పలువురు మండిపడుతున్నారు.
ముందస్తుగా ఎందుకు..?
ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష జూన్లో ఉంటుంది. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్, నవంబరు-డిసెంబరులో బీఈడీ తరగతులు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ బీఈడీ కళాశాలల తనిఖీలకు షెడ్యూల్ ఇవ్వలేదని, తెవివిలో మాత్రం ముందస్తుగా చేపట్టడం ఏంటని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. నూతన వీసీల నియామకం పూర్తయిన తర్వాతనే తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.
పారదర్శకంగా చేపడతాం
- ఆచార్య ఘంటా చంద్రశేఖర్, తెవివి అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్
బీఈడీ కళాశాలల తనిఖీ పూర్తి పారదర్శకంగా చేపడుతాం. ఎన్సీటీఈ నిబంధనలకు లోబడి పూర్తి వసతులు, బోధకులతో నడుస్తున్న కళాశాలకు మాత్రమే గుర్తింపు ఇస్తాం. దీనిపై ముందస్తుగానే కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలిచ్చాం. గుర్తింపు ఉన్న కళాశాలలకే స్కాలర్షిప్స్ ఇవ్వాలని ఉన్నత విద్యా మండలికి లేఖ పంపుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?