తక్కువైనా పర్వాలేదు.. ఎక్కువ కావొద్దు!
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల కోలాహలం నెలకొంది.. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సభలు.. ర్యాలీలు.. భోజనాలు, వాహనాలు ఇలా.. ఎన్నో ఖర్చులు ఉంటాయి.
ప్రచారంలో ప్రతి పనికీ లెక్క!
ఎన్నికల కోసం వీడియోతో ప్రత్యేక పరిశీలక వాహనం
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల కోలాహలం నెలకొంది.. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సభలు.. ర్యాలీలు.. భోజనాలు, వాహనాలు ఇలా.. ఎన్నో ఖర్చులు ఉంటాయి. రణరంగంలో పైచేయి సాధించడానికి అభ్యర్థులు హద్దులు దాటకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు నిర్దేశించింది. వీటని పక్కాగా అమలు చేయడానికి ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించింది. వీరు నిత్యం పరిశీలిస్తూ ఖర్చు లెక్కిస్తారు. హద్దు దాటతే అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది. అభ్యర్థులూ తస్మాత్ జాగ్రత్త..!!
న్యూస్టుడే, ఆర్మూర్: లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం నిమిత్తం ఈసీఐ వ్యయ పరిమితిని రూ.95 లక్షల వరకు నిర్ణయించింది. పరిమితి దాటి ఖర్చు చేసినా, వాటికి సంబంధించిన లెక్కలను సరైన ఆధారాలతో సమర్పించకున్నా అభ్యర్థులపై వేటు వేసేలా ఎన్నికల సంఘం నిబంధనలున్నాయి. నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి ఎన్నికల ఖర్చు లెక్కిస్తారు. అభ్యర్థి ఏదైనా జాతీయ బ్యాంకులో నూతన ఖాతా తెరవాల్సి ఉంటుంది. అదే ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహించాలి. నామినేషన్కు ముందు అభ్యర్థులు చేపట్టిన ప్రచారాలు, సభలు ఇతర కార్యక్రమాల ఖర్చులను సంబంధిత పార్టీల ఖర్చు కింద జమ చేస్తారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. నామినేషన్ తర్వాత అభ్యర్థులు చేసే ప్రతి కార్యక్రమాన్ని వ్యయపరిశీలకులు నీడలా వెంటాడుతారు.
హద్దు దాటితే వేటే
ఫలితాలు వెల్లడించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరూ తమ పూర్తిస్థాయి ఖర్చు వివరాలను బిల్లులతో సహా అధికారులకు అప్పగించాలి. పరిమితికి మించి ఖర్చు చేసినా, వ్యయానికి సంబంధించిన లెక్కలను సమయంలో చూపకున్నా సంబంధిత వ్యక్తులపై వేటు పడటంతో పాటు తర్వాతి ఎన్నికల్లో పోటీచేసే హక్కు కోల్పోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల సంఘం నిర్ధారించిన ధరలు (రూ.)
- వీడియో చిత్రీకరణ: 45,000 (నెలకు)
- ఫంక్షన్హాల్ (రోజుకు): 20,000
- బెలూన్ (బిన్సైజ్): 20,000
- టీ: 10
- స్నాక్స్: 15
- లెమన్,
- రైస్ ప్యాకెట్: 40
- డప్పులు (ఒకరికి): 700
- ప్రచార రథం: 3,000
- హోటల్ ఛార్జీలు (రోజుకు): 2,000
- టెంట్ సామగ్రి: 12,000
- ఎల్ఈడీ స్క్రీన్: 5,000
- కళాబృందాలు (ఒకరికి): 1,000
- పవర్ జనరేటర్: 7,000
- కూలర్: 1500
- పోస్టర్లు: 5,000
- హోర్డింగులు: 6,000
- టెంట్ (18/36): 2,500
- బ్యానర్లు (దుస్తులు): 6000
- పోడియం, పెండర్ నిర్మాణం: 150
- యాంప్లీఫైర్, మైక్రోఫోన్: 2,500
- లైటింగ్ ఛార్జీలు (రోజుకు ఎల్ఈడీ): 200
వాహనాలు (డ్రైవర్తో సహ):
- ఇన్నోవా 3,500
- త్రీవీలర్లు 1500
- సుమో 3,000
- వ్యాన్ 7,000
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగు మారిన మిషన్ భగీరథ నీరు
[ 27-07-2024]
మండలంలోని తాండూర్ గ్రామంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్భగీరథ నీరు కలుషితంగా వస్తోంది. -
ఎన్ఏ సర్వేపై ఉపాధ్యాయులకు శిక్షణ
[ 27-07-2024]
జాతీయ సాధన సర్వే (నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే) 2024 లో భాగంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్