కళాశాలల తనిఖీలకు వేళాయె
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం
న్యూస్టుడే, తెవివి క్యాంపస్: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. చాలా ప్రైవేటు కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా కనీస ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఏటా వర్సిటీ నుంచి అనుబంధ గుర్తింపు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన విద్యా సంవత్సరం కోసం ఈ నెల 25 నుంచి మే 13 వరకు ఈ తనిఖీలు చేపట్టనున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు.
ప్రమాణాలు పాటిస్తున్నట్లు చూపిస్తూ..
వర్సిటీ పరిధిలో 3 ప్రభుత్వ, 12 ప్రైవేటు పీజీ కళాశాలలు, 16 ప్రభుత్వ(గురుకులాలు కలిపి), 54 ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. 3 ఎంబీఏ, 1 ఎంసీఏ కళాశాలలున్నాయి. యూజీసీ, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీ నిర్దేశించిన నిబంధనలు కళాశాలలు పాటించాల్సి ఉంటుంది. సొంత భవనాలు, ల్యాబ్లు, అర్హత కలిగిన అధ్యాపకులు, క్రీడా మైదానం సౌకర్యాలు లేని కళాశాలలు ఉన్నాయి. అయితే ముందస్తు సమాచారంతో యూనివర్సిటీ అధికారులు తనిఖీలకు వెళ్తుండటంతో పలు ప్రైవేటు యాజమాన్యాలు అన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్లు చూపిస్తున్నాయనే విమర్శలు నెలకొన్నాయి. పలు కళాశాలలు యూనివర్సిటీ నిర్దేశించిన పరీక్ష ఫీజు కంటే అధిక వసూళ్లకు పాల్పడుతున్నాయని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ డబ్బులను కట్టించుకుంటున్నట్లు వివరాలతో వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
నెల రోజుల గడువు
యూజీసీ, ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీ నిర్దేశించిన నియమ, నిబంధనలకు లోబడి తనిఖీలు ఉంటాయి. ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు కచ్చితంగా ప్రమాణాలు పాటించాలి. కనీస సౌకర్యాలు లేని కళాశాలలకు వాటి కల్పనకు నెల రోజుల గడువు ఇస్తాం.
ఆచార్య చంద్రశేఖర్, తెవివి అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం