ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
పుర ఛైర్మన్ సత్యనారాయణకు కండువా వేసి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న మంత్రి రాజనర్సింహ, చిత్రంలో ఎమ్మెల్యే మదన్మోహన్, ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్
ఈనాడు, కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణం, న్యూస్టుడే: ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పుర ఛైర్మన్ సత్యనారాయణ భారాసను వీడి మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో హస్తం కండువా కప్పుకొన్నారు. మరోవైపు భారాస కౌన్సిలర్లు ఇతర సభ్యులతో కలిసి ఛైర్మన్పై బుధవారం కలెక్టర్కు అవిశ్వాస నోటీసు అందించారు. దీంతో పురపాలక సంఘం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
బల్దియాలో పార్టీల బలాబలాలు
పురపాలికలో మొత్తం 12 వార్డులుండగా 2019లో జరిగిన ఎన్నికల్లో భారాస 9, కాంగ్రెస్ 3 వార్డుల్లో విజయం సాధించాయి. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్కు చెందిన కౌన్సిలర్లు సైతం భారాసలో చేరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరు కౌన్సిలర్లు హస్తం గూటికి చేరారు. ప్రస్తుతం ఛైర్మన్ పనితీరుపై అసంతృప్తి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు సుజాతతో పాటు ఎనిమిది మంది సభ్యులు అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.
ఏడాది కిందట ప్రయత్నాలు
ఏడాది కిందట ఛైర్మన్ సత్యనారాయణ పనితీరుపై అసంతృప్తి చెందిన భారాస కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అప్పటి ఎమ్మెల్యే సురేందర్ కౌన్సిలర్ల మధ్య సయోధ్య కుదుర్చడంతో అవిశ్వాస ప్రయత్నాలను సభ్యులు విరమించుకున్నారు. ఇటీవల కామారెడ్డి పురపాలికలో ఛైర్పర్సన్పై అవిశ్వాసం నెగ్గడంతో ఎల్లారెడ్డిలో సైతం అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు
ఛైర్మన్ పదవి ఆశిస్తున్న వ్యక్తి తనకు మద్దతు ప్రకటిస్తున్న కౌన్సిలర్లను శిబిరానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారాస నేతల సూచనల మేరకు కౌన్సిలర్లు ఛైర్మన్ సత్యనారాయణపై అవిశ్వాసానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఛైర్మన్ పార్టీ మారడంతో.. భారాసకు మద్దతు తెలుపుతున్న కౌన్సిలర్లు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం కోడ్ అమల్లో ఉన్న సమయంలో అవిశ్వాసం సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. కలెక్టర్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం