రాష్ట్రంలో చివరి స్థానం
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది.
నిరాశాజనకంగా ఇంటర్ ఫలితాలు
ప్రథమంలో 34.81, ద్వితీయంలో 44.29 శాతం ఉత్తీర్ణత
ఈనాడు, కామారెడ్డి, కామారెడ్డి విద్యావిభాగం, న్యూస్టుడే: కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో 34.81 శాతం, ద్వితీయ సంవత్సరంలో 44.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతంలో కొవిడ్ కారణంగా 70 శాతం ప్రణాళికతో పరీక్షలు జరిగాయి. గతేడాది నుంచి వందశాతం పాఠ్యప్రణాళికతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రత్యక్ష తరగతులు నిర్వహించడంతో ఉత్తీర్ణత శాతం కొంత మెరుగైంది. ఐదేళ్లలో 50 నుంచి 68 శాతం నమోదు కాగా ఈ ఏడాది ఫలితాలు ఊహించని విధంగా కంగుతినిపించాయి.
అమ్మాయిలదే పైచేయి
ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో విద్యార్థినులు 44.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 38.73 శాతం ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు 5.45 శాతం అధికంగా ఫలితాలు నమోదు చేశారు. రెండో సంవత్సరంలో అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 53.9 శాతం కాగా అబ్బాయిలు 34.21 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు.
వృత్తివిద్యా కోర్సుల్లో..
వృత్తివిద్యా కోర్సు(వొకేషనల్) ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 28వ స్థానంలో నిలిచింది. 86 విద్యార్థులకు గాను 29 మంది (33.72 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 26వ స్థానంలో నిలవగా 46.67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం విద్యార్థులు 1502 మందికిగాను 701 మంది ఉత్తీర్ణులయ్యారు.
పర్యవేక్షణ లోపమే కారణం
కొవిడ్ తర్వాత 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో జిల్లాలో ఉత్తీర్ణత 59 శాతం, 2022-23లో 67 శాతం నమోదు కాగా.. ఈ ఏడాది మాత్రం 44.29 శాతానికే పరిమితమైంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణపై యంత్రాంగం పర్యవేక్షణ కొరవడింది. మండలాల్లోని జూనియర్ కళాశాలల్లో ఫలితాలు రాబట్టేందుకు అధికారుల కసరత్తు అంతంతమాత్రంగానే చేశారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రస్థాయిలో చిట్టచివరి స్థానంలో కామారెడ్డి జిల్లా నిలవడం ఫలితాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. కాగా జిల్లాలో ఆయా చోట్ల మాస్ కాపీయింగ్కు పాల్పడిన చోట్ల పర్యవేక్షకులు కఠినంగా వ్యవహరించారు. సదాశివనగర్ మండలంలో నలుగురు అధ్యాపకులు సస్పెన్షన్కు గురయ్యారు. దీంతో అన్ని కేంద్రాల్లో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. దీంతో విద్యార్థులు కొంత మేర భయంభయంగా పరీక్షలు రాయడం.. ఆ ప్రభావం ఫలితాలపై పడింది.
అనుత్తీర్ణులు నిరాశ చెందొద్దు
షేక్ సలాం, ఇంటర్ నోడల్ జిల్లా అధికారి
ఇంటర్ ఫలితాల్లో అనుత్తీర్ణులైన వారు నిరాశచెందొద్దు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు. త్వరలో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి మెరుగైన ఫలితాలు సాధించాలి. గతంలో కన్నా ఈ సారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు తగ్గాయి. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లా ఆఖరు స్థానంలో నిలవడం బాధాకరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల