ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే
సీ-విజిల్, 1950 కాల్సెంటర్లకు ఆదరణ
ఈనాడు, కామారెడ్డి
కంట్రోల్రూంలో 1950 కాల్సెంటర్లో అధికారులు
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి కలెక్టరేట్లో కంట్రోల్రూం ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, రాజకీయ నేతల ఉల్లంఘనలు తదితరాలపై ఫిర్యాదులు వస్తున్నాయి.
గ్రామాల నుంచే ఎక్కువ..
లోక్సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, నేతల హడావుడి కొంతమేర తక్కువగానే ఉంది. కానీ, అక్కడక్కడ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా పల్లెల నుంచే ఉంటున్నాయి. రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఎన్నికల సమయంలో ఎన్ని మద్యం సీసాలు ఇంటిలో నిల్వ ఉంచుకునే వీలుందని కాల్సెంటర్ నిర్వాహకులను అడిగారు. మాచారెడ్డి మండలం ఫరీద్పేటకు చెందిన మరొకరు ద్విచక్రవాహనంపై పార్టీ జెండా పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలా? అనే సందేహం వెలిబుచ్చారు. మద్నూర్ మండలానికి చెందిన ఒకరు ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు ఎరవేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ఎన్నికలు ముగిసే వరకు సేవలు
జిల్లాలో ఓటరు సహాయ కేంద్రం (1950) సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
పారదర్శకతకు పెద్దపీట
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై సీ- విజిల్ యాప్లో ఫిర్యాదు చేస్తే అది ఎన్నికల సంఘానికి చేరుతుంది. అందులో ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారి నియంత్రణలోని మానిటరింగ్ సెల్కు వెళ్తుంది. అక్కడి నుంచి ఐదు నిమిషాల్లో క్షేత్ర పరిశీలనలోని ఎంసీసీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు చేరుతుంది. ఆయా అధికారులు అందిన ఫిర్యాదులపై 15 నిమిషాల్లో క్షేత్రస్థాయి విచారణ చేస్తారు. ఆ నివేదికను 30 నిమిషాల్లో రిటర్నింగ్ అధికారికి వెళ్లేలా నమోదు చేస్తారు. దానిని రిటర్నింగ్ అధికారి 50 నిమిషాల్లో పరిశీలించి ఉల్లంఘన జరిగినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఓటీపీతో నమోదు
ఫిర్యాదుదారుడు 1950 నంబరుకు కాల్ చేసినప్పుడు అతని పేరు, ఫోన్ నంబరు, వ్యక్తిగత వివరాలు సిబ్బంది అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత అతడి ఫోన్ నెంబర్కు ఓటీపీ పంపిస్తారు. దాన్ని సిబ్బందికి తెలియజేస్తే వారు ఫిర్యాదు చేసుకుని సమస్యను సంబంధిత విభాగానికి చేరవేస్తారు. ఆపై సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై ఎన్నికల అధికారి రోజువారి సమీక్ష నిర్వహిస్తున్నారు. నిర్దేశిత సమయంలో పరిష్కరించకపోతే అందుకు గల కారణాలను నోడల్ అధికారి రాతపూర్వకంగా ఎన్నికల అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది.
ఫిర్యాదుల వివరాలు
అంశం అందినవి
1950 493
సీ- విజిల్ 40
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగు మారిన మిషన్ భగీరథ నీరు
[ 27-07-2024]
మండలంలోని తాండూర్ గ్రామంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్భగీరథ నీరు కలుషితంగా వస్తోంది. -
ఎన్ఏ సర్వేపై ఉపాధ్యాయులకు శిక్షణ
[ 27-07-2024]
జాతీయ సాధన సర్వే (నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే) 2024 లో భాగంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
నిధులిస్తేనే సదుపాయాలు
[ 27-07-2024]
రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటోంది. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
సమస్యలు విని.. పరిష్కారం చూపి
[ 27-07-2024]
పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) తరుణ్కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయి. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...!
[ 27-07-2024]
మాచారెడ్డి మండలం మఠంరాళ్ల తండాలో మహిళా రైతు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమెకు తక్కువ ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ : పోచారం
[ 27-07-2024]
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం పార్టీ మారానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా..?
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్లో దేశం తరఫున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమె లాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు.. తప్పని అవస్థలు
[ 27-07-2024]
వానలకు జిల్లాకేంద్రంలో అంతర్గత రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. సీసీ, బీటీ లేచి గుంతలు పడ్డాయి. తారు లేచి వాహన చోదకులకు అసౌకర్యంగా మారింది. -
కోర్టులో సాక్షి ఫొటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు
[ 27-07-2024]
మొదటి అదనపు జిల్లా కోర్టులో ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తనను నిందితుడు ఫొటో తీశాడని ఓ సాక్షి న్యాయమూర్తికి తెలిపారు. -
పైపులకు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
[ 27-07-2024]
కులం పేరుతో దూషించి పొలంలోని తుంపర్ల పైపులకు నిప్పు పెట్టిన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన మునిగె చిన్న లింబన్న అలియాస్ కత్తి అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4700 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు